Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

The fog has deside died: పొగమంచు పొట్టనపెట్టుకుంది

--నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదాలు --వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం --బైక్ ఢీకొని ఇద్దరు, వారిని చూసేందుకు వస్తూ ఐదుగురు

పొగమంచు పొట్టనపెట్టుకుంది

–నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు
–వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
–బైక్ ఢీకొని ఇద్దరు, వారిని చూసేందుకు వస్తూ ఐదుగురు 

ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ జిల్లాలో సోమవారం వ
వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదాలు వేర్వేరు అయినప్పటికీ రెండు ప్రమాదాలకు సంబంధం ఉంది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజి వద్ద NH 186పై ఒక ప్రమాదం చోటు చేసుకోగా మరొకటి అదే ప్రాంతానికి సమీపంలోని పార్వతీపురం వద్ద జరిగింది. రెండు ప్రమాదాలు కూడా విధివoచితంగా భావించవచ్చు.

రెండు వేర్వేరు ఈ ఘోర ప్రమాదాల్లో మొత్తంగా ఏడుగురు దుర్మర ణం పాలయ్యారు. దీంతో మృతుల ఆయా కుటుంబాల్లో తీరని విషా దం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా నిడమనూరు మండ లం వెంపాడ్ స్టేజి వద్ద NH 186పై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరి గింది.

  • వాతావరణం లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకొని విస్తృ తస్థాయిలో సోమవారం ఉదయం పోగమంచు పేరుకపోవడం తో ఈ ప్రమాదాలకు పొగ మంచే ప్రధాన కారణంగా చెబుతున్నారు. నిడమ నూరు మండలం వెంపాడ్ స్టేజి వద్ద జాతీయ రహదారి186పై రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ (19)ని అటువైపు నుంచి బైక్ పై వెళ్తున్న నాగరాజు (28) బలంగా ఢీ కొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే అసువులుబాసారు.

ఆయితే ప్రమాద సమచారం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు రమావత్ కేశవులును చూసేందుకు ఆదరాబాదరాగా బయల్దేరిన కుటుంబ సభ్యుల టాటా ఏస్ ను పార్వతీపురం వద్దకు రాగానే అయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టిoది. దీంతో టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలుకాగా మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉంది.

బైక్ ఢీకొన్న ప్రమాదంలో రమావత్ కేశవులు(19), నాగరాజు(28)లు ఇద్దరు మృతి చెందగా ఆటో ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో రమావత్ గణ్య(40), రమావత్ పాండు (40), రమావత్ బుజ్జి(38) ముగ్గురు మరణించారు.

మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవానికుంట తండాకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్షల కోసం తరలించారు.

ఈ మేరకు పోలీసులు రెండు ప్రమాదాలకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సోమవారం తెల్లవారుజామునే ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఒకరి వెంట ఒకరు మృత్యువాత పడడంతో వారి వారి కుటుంబాలతో పాటు మల్లెవాని కుంట తండాలో విషాదం నెలకొంది.