Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Agricultural University : వ్యవసాయ విశ్వవిద్యాలయం వి నూత్నo, రైతు ముంగిట్లో శాస్త్రవేత్త లు

Telangana Agricultural University: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యా లయం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రైతాంగానికి నా ణ్యమైన విత్తనం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” పేరుతో వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి రెండు వినూత్న కార్యక్రమాలు చేపడు తున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య వెల్లడించారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 116వ అకడమిక్ కౌన్సిల్ సమావే శం ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య అధ్యక్షతన శనివారం రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాల యం ఆడిటోరియం సెమినార్ హాల్ లో జరిగింది. ఈ సమావేశ వివరా లను ఉపకులపతి మీడియాకు వి వరించారు.

ఆరు నెలల క్రితం విశ్వ విద్యాల యం ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన తాను విశ్వ విద్యాల యంలో అనేక పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టానన్నారు. భవిష్య త్తులోనూ అవి సాగుతాయన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితు లు మార్కెట్ పరిస్థితులు, ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీల నేపథ్యంలో శాస్త్రవేత్త ల పరిశోధనలు మారాలని ఆయన సూచించారు. భారతీయ వ్యవసా య పరిశోధన మండలి (ICAR) కాలానుగుణంగా పునర్వ్యవస్థీక రణ అవుతోందని తాను ఆ దిశ గానే వ్యవసాయ విశ్వవిద్యా ల యంలో మార్పులకు శ్రీకారం చు ట్టానన్నారు.

విశ్వవిద్యాలయంలో సుమారు 300 బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరామన్నారు. ఈ ఎంపిక పూర్తిపారదర్శకతతో చే పడతామన్నారు. ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ని రుద్యోగ యువతకు పూర్తి న్యా యం చేస్తామన్నారు. విదేశీ విద్యా ర్థులకు ప్రవేశాలు కల్పించాలని ఈ రోజు అకడమిక్ కౌన్సిల్ నిర్ణయిం చిందని జానయ్య తెలిపారు. అం దులో భాగంగా తొలుత 10 మంది నేపాల్ విద్యార్థులకు ప్రవేశాలు క ల్పిస్తామన్నారు. అదేవిధంగా పిహె చ్ డి చేసిన ప్రతి విద్యార్థికి నెలకి 30 వేల రూపాయలతో ఉపకార వే తనం ఇస్తూ రెండేళ్ల పాటు విశ్వవి ద్యాలయంలోనే పోస్ట్ డాక్టోరల్ అ కడమిక్ అప్రెంటిస్ షిప్ చేసుకునే అవకాశం ఇస్తూ వారి సేవలను విశ్వవిద్యాలయం వినియోగించు కుంటుందన్నారు. ప్రభుత్వం ఎప్పు డు కొత్త వ్యవసాయ కళాశాలల్ని ఏర్పాటుచేసినా అందుకు అవస రం ఆయన చర్యలు తీసుకోవడా నికి అకాడమిక్ కౌన్సిల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని జానయ్య వివరిం చారు. అదేవిధంగా రైతాంగానికి మరింత విస్తృత సేవలు అందించ డానికి రెండు కొత్త కార్యక్రమాల్ని త్వరలో అమలు చేయనున్నామని ప్రకటించారు.

“నాణ్యమైన విత్తనం – రైతుకి నేస్తం” పేరిట వచ్చే జూన్ రెండో తేదీన రాష్ట్రంలోని 12 వేల రెవె న్యూ గ్రామాల్లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వరి, కం దులు, పెసలు, మినుములు, జొ న్న పంటలకు సంబంధించి ఒక గ్రా మంలో 3-5 మంది రైతుల చొప్పు న సుమారు 40 వేల మంది రైతుల కు నాణ్యమైన విత్తనం అందిస్తు న్నామన్నారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్య క్రమం ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా యూరియా వాడకం, పు రుగుమందుల సక్రమ వినియోగం, నీటి సమర్ధ యాజమాన్యం వంటి 5-6 అత్యవసర సాగుకి సంబంధిం చిన అంశాలపై రైతుల్లో అవగాహ న కల్పించేందుకు మే 6వ తేదీ నుం చి జూన్ 13వ తేదీ వరకు “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదా తల అవగాహన కార్యక్రమం” నిర్వ హిస్తామన్నారు.

వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఒక్కో శాస్త్రవేత్త బీఎ స్సీ చివరి సంవత్సరం విద్యార్థి, PG విద్యార్థులతో కలిసి వారానికి ఒక గ్రామం చొప్పున 6 వారాల్లో 6 గ్రా మాలు సందర్శిస్తారని ఉపకులపతి వివరించారు. విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమ 10 ర్యాంకుల జాబితా లో నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆల్దాస్ జానయ్య పిలు పునిచ్చారు. ఈ అ కడమిక్ కౌన్సిల్ సమావేశంలో విశ్వవిద్యాలయ రిజి స్ట్రార్ డాక్టర్ G.E.CH విద్యాసా గ ర్, విశ్వవిద్యాలయ అధికారులు, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు పాల్గొ న్నారు.