Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

If we recycle the ration rice, we will reap the benefits: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తాట తీస్తాం

--మిల్లర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ --హుజూర్‌నగర్‌లోని రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి

రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తాట తీస్తాం

–మిల్లర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్
–హుజూర్‌నగర్‌లోని రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి

ప్రజా దీవెన/ హుజూర్ నగర్: పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లర్లు, ఇతరులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం హుజూర్‌ నగర్‌లోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం, ఇతర సేవల నాణ్యతను పరిశీలించిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు 54 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 కిలోల బియ్యం అందుతున్నాయని అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 6 కిలోల బియ్యాన్ని అందిస్తుందని వివరించారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ల నుండి మొత్తం సేకరణ ఖర్చు కిలోకు రూ. 39. అయితే, దాదాపు 70-75% రేషన్ బియ్యాన్ని మిల్లర్లు మరియు ఇతర అసాంఘిక సంస్థలు రీసైక్లింగ్ చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తుందని బియ్యం రీసైక్లింగ్‌లో ఎవరైనా ప్రమేయం ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు, అందుకు సంబంధించిన ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌పై దాదాపు 56,000 కోట్ల రూపాయల భారీ అప్పుల భారం మోపిందన చెప్పారు.

2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పు రూ.3300 కోట్లు మాత్రమేనని ప్రస్తుతం రేషన్ పంపిణీ, వరి ధాన్యం సేకరణ బాధ్యత కలిగిన కార్పొరేషన్ వార్షిక వడ్డీ భారం రూ.3,000 కోట్లు దాటిందని వివారించారు. గత ప్రభుత్వం ఈ శాఖ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో దశాబ్ద కాలంగా కార్పొరేషన్‌కు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీ లేదా బ్యాంక్ గ్యారెంటీ లేకుండా రైస్ మిల్లర్లకు రూ.22,000 కోట్ల విలువైన వరి నిల్వలను అప్పగించిన విధానాన్ని ఆయన విమర్శించారు.

కార్పొరేషన్ ఇప్పుడు ప్రమాదకర, ఆందోళనకరమైన స్థితిలో ఉందని కర్ణాటక, తమిళనాడు తెలంగాణ ప్రభుత్వం నుండి గణనీయమైన బియ్యం నిల్వలను కొనుగోలు చేయడానికి ముందుకొస్తే, గత ప్రభుత్వం, రాజకీయ కారణాల వల్ల, బియ్యాన్ని గోడౌన్లలో పాడైపోవడానికి కారణమైందని దుయ్యబట్టారు. బియ్యాన్ని కర్ణాటకకు మార్కెట్ ధరలకు విక్రయించకుండా వడ్డీ ఖర్చులతో కార్పొరేషన్‌పై భారం మోపిందని, తమిళనాడు గణనీయమైన వడ్డీ భారంతో కార్పొరేషన్ ఆందోళనకర పరిస్థితిలో ఉందని తెలిపారు.

ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడుకు బియ్యం విక్రయాలను పరిశీలిస్తు న్నామని పారదర్శక యంత్రాంగం ద్వారా వరి నిల్వలను బహిరం గంగా విక్రయించాలని చూస్తున్నామని అన్నారు. కార్పొరేషన్‌ను దాని ప్రమా దకర స్థితి నుండి రక్షించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నా మని ఆయన ప్రకటించారు.

కార్పొరేషన్‌లో చివరి సారిగా 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ పూర్తయిందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్‌లో ఆడిట్‌ను వేగవంతం చేసి, రేషన్‌ కార్డుదారులకు, ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు సేవలను మెరు గుపరిచేందుకు, శాఖను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు