Diamond Jubilee : (ప్రజా దీవెన శాలిగౌరారం : వరంగల్ జిల్లా ఎలుకతుర్తి లో ఈ నెల 27 న జరిగే బిఆర్ఎస్ వజ్రోత్సవ సభను జయప్రదం చేయాలని శాలిగౌరారం మండల బి ఆర్ ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు మామిడి రమేష్ కోరారు.అయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాల సుధీర్గ పోరాటాలు చేసి
తెలంగాణ సాధించిన పార్టీ 25 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. మండలం లోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బాకీ వెంకటయ్య, రాచకొండ గణేష్, కోడిమాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.