Yoga Class : ప్రజా దీవెన, చిట్యాల: ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిని త్యం యోగా సాధన చేయాలని ఆయుష్ డిపార్ట్మెంట్ చిట్యాల హో మియో డిస్పెన్సరీ మెడికల్ ఆఫీ సర్ డాక్టర్ తయ్యబా అన్నారు. చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయు ష్ డిపార్ట్మెంట్ హోమియో డిస్పెన్స రీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యా ర్థులకు వేసవి సెలవులు ఉన్నం దున ప్రతినిత్యం యోగా సాధన చేసుకునేందుకుగాను అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వేసవి సెలవుల్లో విద్యార్థు లు యోగా చేసి ఆరోగ్యంగా ఆనం దంగా ఉంటూ సాధన చేయాలని ఎండాకాలంలో తీసుకోవలసిన జా గ్రత్తల గురించి వివరించారు.
వి ద్యార్థులు నిత్యం చదువు పట్ల ధ్యాస నిలిపేందుకు ధ్యానాన్ని సాధన చేయాలని సూచించారు యోగా శిక్షకులు బజరంగ్ ప్రసాద్. వైష్ణవిలు పలు యోగాసనాలను ప్రదర్శించి వాటి సాధన తో కలిగే ప్రయోజనాలను ఫలితాలను వివ రించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి మాధవి, హోమియో డిస్పెన్సరీ ఫార్మసిస్ట్ సరిత, ఫిజికల్ డైరెక్టర్ జానకి, ఉపాధ్యాయులు మధుమతి శ్రీనివాస్ పద్మజ కోణం శ్రీనివాస్ కవిత సైదులు ప్రసన్న శైలజ శంకరయ్య సౌమ్య శ్రీనివాస్ తిరుమల తదితరులు పాల్గొన్నారుచిట్యాల హోమియో డిస్పెన్సరీలో ప్రతిరోజు ఉదయంఏడు గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు ఉచితయోగా శిక్షణ ఉంటుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ తయ్యాబా తెలిపారు.