Terrorattack: ప్రజా దీవెన, కశ్మీర్: కాశ్మీర్ లో ఉగ్రమూకలు క ల్లోలం సృష్టించిన విషయం విధితమే. కశ్మీర్లోని పెహ ల్గామ్లో ఉగ్ర వాదులు మంగళ వారం ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలి సిందే. ఈ దాడిలో సు మారు 26 మంది టూరిస్ట్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదుల చర్యలకు ప్రతీకార చర్యలు ప్రారంభించాయి భద్రతా బలగాలు. ఉగ్రమూకల దుశ్చర్యల పై అప్రమత్తమైన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం తెల్లవారుజామున హతమార్చా యి.
హృదయ విధారక ఘటన మరవక ముందే మరో ప్రాంతంలో ఉగ్రవాదు లు చొరబాటుకు యత్నించారు. అ ప్రమత్తమైన సైన్యం వారి ప్రయత్నా న్ని విజయవంతంగా తిప్పికొట్టింది. కాల్పులు జరిపి వారిని తుదముట్టించింది.బుధవారం ఉదయం బారాముల్లా లోని ఉరి వద్ద ఉన్న సర్జీవన్ ప్రాం తం గుండా సుమారు ముగ్గురు ఉ గ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు.
నియంత్రణరేఖ వద్ద అ ప్రమత్తమైన భద్రతా బలగాలు వారిని అడ్డు కున్నారు.చొరబాటు ప్రయ త్నాన్ని సైన్యం విజయవంతంగా భ గ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ భీకరమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవా దులు మరణించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయు ధాలు, మందుగుండు సామగ్రిని స్వా ధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో విజయవంతంగా ఆపరేషన్ కొనసాగుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరువురు తెలుగువారి మృతి… కాశ్మీర్ లో పర్యాటకులు ఉగ్రమూ కల దాడి లో పదుల సంఖ్యలో మృ త్యు వాతపడ్డ విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో కావ లికి చెందిన మధుసూదన్, విశాఖ కు చెందిన చంద్రమౌళి ఇద్దరు తెలుగువారు మృత్యువాతపడ్డారు. బెంగళూరులో స్థిరపడ్డ మధు సూదన్ కుటుంబం కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లగా,వి శాఖకు చెందిన చంద్రమౌళిని కాల్చిచంపిన ఉగ్రవాదులు. పహల్గా మ్లో చంద్రమౌళిని పారిపోతున్నా వెంటాడి ఉగ్రవాదులు కాల్చి చం పారు. చంపొద్దని వేడుకున్నా ఏమాత్రం కని కరించకుండా హత మా ర్చారు. ఈ నెల 18న జమ్ముకశ్మీర్కు చంద్ర మౌళి దంపతులు వెళ్లిన ట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
సైనిక దుస్తుల్లో వచ్చి ఉగ్రదాడి… ఏడుగురు ఉగ్రవాదులు ప హ ల్గాంలో సైనిక దుస్తుల్లో వచ్చి ప ర్యాటకులపై దాడి చేసినట్లు అధి కారిక వర్గాలు వెల్లడించాయి. ఇది లా ఉండగా ఉగ్రదాడికి పాల్పడిం ది తామేనంటూ టిఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.