Big Breaking News : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాను డ్రగ్స్ , గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది యువతకు డ్రగ్స్, గంజాయి తీసుకోవడంతో జరిగే అనర్ధాలపై వివరిస్తూ అవ గాహన కల్పించడం జరుగుతోం దని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. డ్రగ్స్ అలవాటు పడిన యువతకు రిహాబిలిటేషన్ మరి యు వైద్యసహాయం కూడా అం దించి వారిని తిరిగి మామూలు మనషులు గా మార్చడం జరిగిం దని చెప్పారు. నల్లగొండ లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా మం ది తల్లిదండ్రులు వారి పిల్లల భవి ష్యత్తును దృష్టి లో ఉంచుకొని స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి ఈ గం జాయి మరియు డ్రగ్స్ పట్ల సమా చారం ఇవ్వడం చాలా కీలక పరి ణామమని అభివర్ణించారు. అయి తే కొంతమంది యువత డ్రగ్స్ కి బా నిసై, తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పించి నేరాలకు పాల్పడుతున్నార న్నారు.
ఈ నెల 23వ తేదీ బుధవారం రోజు మునుగోడు రోడ్ లో నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమి రెడ్డి రాజశే ఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై సందీ ప్ రెడ్డి, అతని సిబ్బంది మునుగో డు రోడ్డులో వాహన తనిఖీ నిర్వ హిస్తుండగా, ఒక వ్యక్తి అనుమానా స్పదంగా బైక్ పై బ్యాగుతో ఉండ గా, అతన్ని పట్టుబడి చేసి విచారిం చగా స్థానిక అక్కచెల్మ కు చెందిన మమ్మద్ ఖాజా వసీముద్దీన్ (38), గత కొంతకాలంగా స్పాస్మో టాబ్లె ట్స్ సేవిస్తూ వాటికి బానిసై, ఈజీగా డబ్బులు సంపాదించాలని వసీం, అతని స్నేహితులైన కాజా షోయబ్ లు కలిసి వ్యాపారం నిర్వహిస్తు న్నారన్నారు. నల్గొండ చుట్టుప క్కల మెడికల్ షాపులలో ఇట్టి టాబ్లెట్స్ అమ్మట్లేదని, పోలీసు వారికి ఇక్కడ నిఘా ఉంటుందని, ఆరు నెలల నుండి పిడుగురాళ్ల లోని ఛాయా మెడికల్ షాప్ నిర్వా హకుడైన మణిదీప్ దగ్గరికి బైక్ పై వెళ్లి ఒక షీటును వంద రూపాయ లకు కొని, అట్టి టాబ్లెట్స్ ను విని యోగిస్తూ అదే విధంగా అవసరం ఉన్నవారికి 180 రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తు న్నారన్నారు .
ఇదే క్రమంలో మమ్మద్ వసీముద్దీన్ 288 టాబ్లెట్స్ షీట్స్ తీసుకుని, అవసరం ఉన్నవారికి అమ్ముదామ ని వెళుతూ ఉండగా పట్టుబడడం జరిగింది. ఇతడిని తీసుకొని గుర జాలలోనే మెడికల్ షాప్ నిర్వాహ కుడైన మణి దీపిని పట్టుబడి చేసి, అతని వద్ద నుండి 15 షీట్స్, సెల్ ఫోన్, షాపు డాక్యుమెంట్స్ స్వాధీ నం చేసుకోవడం జరిగింది. అలాగే పట్టుబడిన వసీముద్దీన్, మణిదీప్ లను కోర్టుకు జ్యుడీషియల్ రిమాం డ్ కి పంపించగా సీజ్ చేసిన టాబ్లె ట్స్, బైక్, నగదు, సెల్ ఫోన్లను కోర్టు కు సమర్పించడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా నిoదితుల్లో ఇద్దరు పరార్ లో ఉన్నారు.
మెడికల్ షాప్ నిర్వాహకులు, ఎట్టి పరిస్థితులలో కూడా డాక్టర్ ప్రిస్క్రి ప్షన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్స్ అ మ్మరాదని, ఒకవేళ అధిక డబ్బులు సంపాదించాలని లక్ష్యంతో అమ్మి నట్లయితే తప్పకుండా జైలుకి వెళ్ళ డంతో పాటు షాప్ లైసెన్స్ రద్దు చే యడం ఖాయమని డీఎస్పీ శివ రాంరెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ రహి త సమాజ స్థాపనలో మెడికల్ షాప్ వాళ్ళందరూ కూడా భాగస్వా మ్యం అవుతూ వారి వంతు బాధ్య తగా ఎవరైనా యువత అనుమా నాస్పదంగా ఇట్టి టాబ్లెట్స్ గురించి వచ్చినట్లయితే వెంటనే 100 కి గా ని సమీప పోలీస్ స్టేషన్ గాని సమా చారం అందించాలని సూచించారు.
ఇదిలా ఉండగా ఇట్టి కేసులో అ త్యుత్తమ ప్రతిభ కనబరిచిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమి రెడ్డి రాజశే ఖర్ రెడ్డి, ఆధ్వర్యంలో ఎస్సైలు శంకర్, సందీప్ రెడ్డి, కానిస్టేబుల్స్ రబ్బాని వెంకటనారాయణ, కిరణ్, షకీల్, శ్రీకాంత్, సైదులు ను జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అభినందిం చారు.