Prime Minister Modi :ప్రజా దీవెన, బీహార్ : పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా శిక్షలు విధిస్తామని ప్రధాని మోదీ తీ వ్రంగా స్పందించారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్లో ని మధుబనిలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీహార్ లోని రూ.869 కోట్ల రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిం చారు. అనంతరం జరిగిన బహిరం గ సభలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా పహల్గామ్ మృతుల కోసం 2నిమిషాలు మౌనం పాటించి శ్ర ద్ధాంజలి ఘటించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.
పహల్గామ్ ఘటన తర్వాత దేశ మంతా దు:ఖంలో మునిగిపోయిం దన్నారు.ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారని వారందరికీ దేశ మం తా అండగా ఉంటుందని హామీ ఇ చ్చారు. మృతుల్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని చెప్పారు. ఉగ్రవా దాన్ని తుదముట్టించే సమయం ఆ సన్నమైందన్నారు. ఉగ్రవాదుల కో సం వేట సాగిస్తున్నామని వారికి స హకరించిన వారిని కూడా వదిలిపె ట్టబోమని మోడీ హెచ్చరించారు.
ఇది ముమ్మాటికీ భారత సమా జంపై దాడే
దేశం దుఃఖంలో ఉంది. ఈ దాడి ప ర్యాటకులపై దాడి కాదు దేశంపై దా డి అంటూ అభివర్ణించిన ప్రధాని మోదీ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవా దులను, దాని వెనుక ఉన్నవారికి ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఉగ్ర వాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి తెలియ జేస్తున్నా ఉగ్రవాదులను వదిలిపెట్ట మని, న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, భారత్ కు మద్దతుగా నిలిచిన ప్రపంచ దే శాలకు కృతజ్ఞతలు అని ప్రధాని మోదీ అన్నారు.
ఆ తర్వాత బిహార్ లో జరిగిన అభి వృద్ధి గురించి మాట్లాడుతూ వివా దాల పరిష్కారంలో భూమి పత్రాల డిజిటలైజేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. స్వతంత్రం త ర్వాత దేశానికి కొత్త పార్లమెంట్ భ వనం వచ్చిందని, 30వేల కొత్త పం చాయతీ భవనాలు కూడా నిర్మించి నట్లు వెల్లడించారు. గ్రామ పంచా యతీలకు నిధులు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత, ఇది గ్రామాల అభివృద్ధికి దారితీసిందన్నారు.
సీఎం నితీష్ మాట్లాడుతూ పంచా యతీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించామని సీఎం నితీష్ కుమార్ అన్నారు. ప్రగతి యాత్ర ద్వారా ఇటీవల బిహార్లో జరిగిన పనులను పరిశీలించామని ఆయన అన్నారు. ప్రధాని మోదీ నే తృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో బి హార్లో అనే అభివృద్ధి కార్యక్రమా లు జరిగినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రోడ్డు పథకం, వర ద నియంత్రణ, ఆరోగ్యం కోసం పెద్ద ప్రకటనలు చేసింది. మఖానా బోర్డు ను ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీ గు రించి వ్యాఖ్యానిస్తూ, అది చాలా గందరగోళంగా మారిందని, మనం ఎప్పటికీ దానితో ముందుకు సాగ లేమని సీఎం నితీష్ అన్నారు. అ నంతరం బిహార్లో రూ.869 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధానమం త్రి ఆవాస్ యోజన కిం ద ప్రజలకు ఇళ్ల తాళాలను ప్రధాన మంత్రి న రేంద్ర మోదీ అందజేశారు.
PM Modi adress on terror attack at Bihar pic.twitter.com/VqhHgXSYTz
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) April 24, 2025