Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rayapudi Chinni : పహల్గాం లోఉగ్రదాడిఅమానుషం

Rayapudi Chinni : ప్రజా దీవేన, కోదాడ: జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా కోదాడ పట్టణంలో ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారిపై బస్టాండ్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి అమరులైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.

 

ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పందిరి నాగిరెడ్డి బడుగుల సైదులు, పంది తిరపయ్య, ముత్తవరపు రామారావు, హరికిషన్, సలీం షరీఫ్, నరసింహారావు, ఉదయగిరి,ఖాజా మియా, జానకిరామ్, బాబు, జి ఎల్ ఎన్ రెడ్డి, గోదేశీ రామారావు, రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.