prisoninmates: నిబంధనల ప్రకారం ఖైదీలకు అన్ని సౌకర్యాలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్
prisoninmates: ప్రజాదీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లా జైలులో ఖైదీలకు అన్ని వస తులతో పాటు, జైలు పరిశుభ్రంగా ఉందని రా ష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్త ర్ తెలిపారు. ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవా రం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును సందర్శించారు. జైలులోని అన్ని బ్యారక్స్ ను, వంటగదిని, ఖైదీలకు పెట్టే ఆహార ప దార్థాలను, భోజ నాన్ని అన్నిటిని పరిశీలించారు. అంతేకాక ఖైదీలతో మాట్లాడి సౌక ర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లా డుతూ నల్గొండ జిల్లా జైలులో సుమారు 177 మంది ఖైదీలు ఉన్నా రని, అందులో 21 మంది మహిళా ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. జై లులో సౌకర్యాలన్నీ పరిశీలించడం జరిగిందని, అన్ని బ్యారక్స్ ను పరిశీలించానని, అధికారుల ప్రవర్తన, సౌకర్యాలు, తదితర వివరాల గురించి ఖైదీలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగిందని, జిల్లా జైలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా నిబంధనల ప్రకారం ఖైదీలకు అ న్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, ముఖ్యంగా ఖైదీలకు భోజనం, ఇతర సౌకర్యాలు బాగున్నాయని, వంటగది బాగుందని, జైలులోఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.
ఖైదీల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. ఖైదీలలో కొం తమంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని తెలిపారు. నియమ, ని బంధనల ప్రకారం జిల్లా జైలును బాగా నిర్వహిస్తుండడం పట్ల ఆయ న సంతృప్తి వ్యక్తం చేశారు. మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కు జిల్లా జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ జైలులో ఖైదీల వివరాలు, సౌకర్యాలు, ఏర్పాట్లు, తదితర వివరాలను తెలియజేశారు. ఖైదీల సంక్షేమంలో భాగంగా వారి కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించా రు. జిల్లా జైలర్ బాలకృష్ణ ఉన్నారు.
అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కు నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, అడిషన ల్ ఎస్పీ రమేష్, డిఎస్పి శివరామిరెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, తదిత రులు పూల మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ ఆసుప త్రులద్వారా అందిస్తున్న సేవలు, సంక్షేమ హాస్టల్ల ద్వారా అందిస్తున్న సేవలు, ఇతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డి.ఎస్.పి శివరాంరెడ్డి, నల్గొండ తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు వీరి వెంట ఉన్నారు.