Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSMallayaYadav : రజతోత్సవ సభకు తరలుదాo

*వరంగల్ సభతో కాంగ్రెస్ కు సెగ_
*ఇంటింటికీ, ఊరూరా తరలిరావాలని ప్రజలకు పిలుపు:
మల్లయ్య యాదవ్

BRSMallayaYadav : ప్రజా దీవేన, కోదాడ: బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభతో కాంగ్రెస్ మోసపూరిత హామీలు, దాష్టికం వెల్లడి కానున్నాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి పల్లె, గడప నుంచి ఒక్కొక్కరు చొప్పున హాజరు కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

శుక్రవారం ఆయన నివాసంలో మాట్లాడారు. అమలుకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో చేతులెత్తే సిందని విమర్శించారు. ముఖ్యమంత్రిని అని చెప్పుకునే ఉత్తంకు మార్ రెడ్డి కోదాడ, హుజూర్నగర్లలో నిధుల వరద అని చెప్పుకొను చున్నారని అభివృద్ధి జాడ ఎక్కడ అని ప్రశ్నించారు.

కోదాడలో మా ప్రభుత్వంలో చేసిన అభివృద్దే కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. కోదాడ నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేల సంఖ్యలో కదలి రావాలని, ప్రతి ఊరికి నియోజకవర్గ కేంద్రంగా బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని, పెద్ద ఎత్తున హాజరై కాంగ్రెస్ పై ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ సంవత్సరన్నర కాలానికే ప్రజాగ్రహానికి గురైందని విమర్శించారు. మళ్లీ కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని, రజతోత్సవ సభ ద్వారా ఇది స్పష్టం కానుందని పేర్కొన్నారు.* కోదాడ నియోజకవర్గంలో అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి ప్రజలను మోసం చేశారు తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు.

నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరుగుతుందో ప్రజలంతా గమని స్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా సభకు స్వచ్ఛందంగా తర లివ చ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ వ్య తిరేకతకు నిదర్శనమని స్పష్టం చేశారు. కేసీఆర్ పై అభిమానం, బీఆర్ఎస్ చేసిన పరిపాలనపై ఇప్పటికీ చర్చించుకుంటున్నారని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు