–నల్గొండలో కులాంతర వివహం
–కులాంతర వివాహల ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి
–కులాంతర వివాహాల ప్రోత్సాహం 10 లక్షలకు పెంచాలి
— కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
Inter-caste marriage : ప్రజాదీవెన నల్గొండ :బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు కులాంతర వివాహాలు కుల రహిత సమాజ స్థాపనకు బాటలు వేస్తాయని, కులాంతర వివాహితుల ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని, కులాంతర వివాహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున కోరారు.
శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవనంలో నాంపల్లి మండలం రెవిల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కూలానికి చెందిన వంగూరి హరీష్ చెరుకుపల్లి గ్రామనకి చెందిన బిసి కమ్మర కులానికి చెందిన నాయక్ మౌనిక ల కులాంతర ఆదర్శ వివహం కేవీపీస్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ భారతదేశాన్ని పట్టి పీడిస్తుందని, మనుస్మృతి ఆధారంగా నిచ్చెన మెట్ల వ్యవస్థ అమలవుతూ కింది కులాలను అంటరాని వారీగా చిత్రికరిస్తూ అనేక ఆంక్షలు పెట్టి దాడులు చేస్తున్నదని ఆరోపించారు. మనుషులు అందరూ సమానమే అందరికి అన్ని హక్కులు భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నాయని వాటిని ఉల్లంగిస్తే శిక్షకు గురవుతారని హెచరించారు. కులాంతర వివహితులకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కులాంతర వివహితులకు రక్షణ చట్టం చేయలని అన్నారు. 10 లక్షలు పరిహారం ఇవ్వాల్ని అన్నారు . కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వివాహానికి కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాదె నర్సింహా అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో కేవీపీస్ రాష్ట్ర కమిటీ సభ్యులు బొట్టు శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్, వంగూరి యాదయ్య, వెంకటమ్మ, కూతురు రఘపతి, జ్యోతి, మద్దిమడుగు వేణు, గాడిపాక వర్మ, అబ్బాగోని ఈశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు.