Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay : బండి సంజయ్ కీలక వ్యాఖ్య, పాక్ వెన్నులో వణుకుపుట్టిస్తాం

Bandi Sanjay : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉగ్రవా దుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహ ల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ పేర్కొన్నారు. తుపాకీ పట్టి నో డు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవా దాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పా కిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చ ర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం క ఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా ని లవాలని కోరారు.

శనివారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభి వ్రుద్ది కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్ గా ర్ మేళా’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్ర కాశ్, వి.సంపూర్ణ తదితరులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ము ఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’. 10 లక్షల ఉ ద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట ని లబెట్టుకున్న నాయకుడు మోదీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తు న్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గా ర్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసినం.

ఈరోజు 15వ రోజ్ గార్ మేళా ద్వా రా దేశవ్యాప్తంగా 51 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. అం టే దాదాపు 10 లక్షల మార్క్కు చేరుకున్నట్లే ఏ చిన్న అవినీతికి, పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా ఇన్ని లక్షల ఉద్యోగా లను భర్తీ చేయడం మామూలు విషయం కాదు. మోదీ ప్రభు త్వా నికి ఆ ఘనత దక్కింది. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుంటే, ఇత ర ఉద్యోగులపై భారం పడుతోంది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించడం కష్ట మైం ది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఎప్ప టికప్పుడు ఏ శాఖలో ఖాళీగా ఉన్న ప్పటికీ ఎప్పటికప్పుడు ఆయా పో స్టులను ప్రధానమంత్రి మోదీ ఆధ్వ ర్యంలో భర్తీ చేస్తున్నారు.

గతంలో ఏ ప్రభుత్వమూ ఎప్పటిక ప్పుడు ఖాళీలను భర్తీ చేసిన దా ఖలాల్లేవ్. ఆ ఘనత మోదీకే దక్కు తోంది. దేశవ్యాప్తంగా ఈరోజు 47 కేంద్రాల్లో రోజ్ గార్ మేళా కార్యక్ర మాన్ని నిర్వహించుకుంటున్నాం. 51 వేల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు ఇవ్వడం గొప్ప విషయం. మన రాష్ట్రం విషయానికొస్తే హైద రాబాద్ సికింద్రాబాద్ లో నిర్వ హించుకుంటున్నాం. ఇక్కడ ఎం సీహెచ్ఆర్డీ కేంద్రం నుండి సుమారు 700 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోబోతున్నారు.

వీరిలో 100 మంది అభ్యర్థులకు నా చేతుల మీదుగా నియమాక పత్రాలు అందించడం ఆనందంగా ఉంది. ఈరోజు అపాయిట్ మెంట్ లెటర్లు అందుకోబోతున్న అభ్యర్థు లకు, వారి కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు. వాస్తవానికి ఒక్కో పోస్టుకు భారీ ఎత్తున పోటీ నెల కొంది. ఆ పోటీని తట్టుకుని పరీక్ష ల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన మీ అందరికీ హ్యాట్సాఫ్.

ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యో గం సాధించిన మీరంతా ఇకపై మీ కప్పగించిన బాధ్యతలను ఇష్టపడి నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చు కోండి. ఎప్పటికప్పుడు కొత్తగా వ చ్చే టెక్నాలజీని, ఉద్యోగాల్లో వస్తు న్న మార్పులను గమనిస్తూ నిరంత రం నేర్చుకుంటూ ముందుకు సాగం డి. మీకు తెలుసు. ఉద్యోగావకాశా ల సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇ వ్వాలన్నది మోదీగారి సంకల్పం. అందుకే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకోగలిగాం. మాట ఇస్తే నె రవేర్చే ప్రభుత్వం నరేంద్రమోదీదే.

గతంలో క్రమం తప్పకుండా వివిధ శాఖల్లోని ఖాళీలను ఎప్పటికప్పు డు భర్తీ చేసిన దాఖల్లేవు. ఆ ఘన త మోదీకే దక్కుతోంది.అంతేగాదు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండి యా, మేక్ ఇన్ ఇండియా పేరుతో ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉ ద్యోగాలు స్రుష్టించే స్థాయికి మన భారతీయ యువతను ప్రోత్సహిస్తు న్నారు. కరోనా హయాంలో అమెరి కాసహా ప్రపంచమంతా ఆర్ధిక సంక్షో భంలో కూరుకుపోతే ఆత్మ నిర్భర్ ప్యాకేజీతో భారత్ ను ఆర్ధికంగా స్థి రంగా ఉంచిన ఘనత మోదీ ప్రభు త్వానిదే.

పేదలకు బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితుల్లో ‘జన్ ధన్ ఖాతా’లను జీరో బ్యాలెన్స్ తో ప్రారంభిస్తామని చెబితే ప్రతిపక్షాలన్నీ హేళన చేశా యి. ఈరోజు దేశంలో బ్యాంకు ఖా తా లేని ప్రతి ఒక్కరికి జన్ ధన్ ఖా తాను ప్రారంభించి నయాపైసా అ వినీతికి తావులేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తు న్నారు. ఒకనాడు నిత్యావసర వ స్తువులు సహా అనేక వస్తువులను భారత్ దిగుమతి చేసుకునేది. మో దీ హయాంలో బియ్యం, నిత్యావ సర వస్తువులుసహా అనేక ఉత్ప త్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చారు.

మన రాష్ట్రం విషయానికొస్తే గత ప్ర భుత్వం క్రమం తప్పకుండా ఉద్యో గాలను భర్తీ చేయడంలో విఫల మైంది. పేపర్ లీకేజీలు, కాలయాప నతో నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి, అక్రమాలు చోటు చేసు కుంటున్నాయి. కానీ కేంద్ర ప్రభు త్వం వాటికి తావులేకుండా క్రమం తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చే స్తుందనే విషయాన్ని గుర్తుంచుకోం డి.

అంతేగాకుండా ప్రధానమంత్రి నరేం ద్రమోదీ ఆధ్వర్యంలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అగ్రభాగాన నిలిచేందుకు నిరంతరం క్రుషి చేస్తున్నారు. గతం లో 11వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానంలో నిలిపారు. మరో మూడేళ్లలో 3వ స్థానానికి తీసుకు వచ్చే దిశగా పనిచేస్తున్నారు. అ ట్లాగే భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కా నున్న సందర్భంగా అప్పటికి అమె రికా, చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాల న్నదే మోదీ ఆకాంక్ష. మోదీ క్రుషిలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు.