— యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
TuwjMalkajgiri : ప్రజా దీవెన, మల్కాజ్ గిరి : జర్నలిస్టుల పక్షపాతిగా నిలబడి, వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పోరాడే శక్తి కేవలం తమ సంఘా నికే ఉందని, గత 65 యేండ్ల నుండి జర్నలి స్టులకు మేలు చేస్తుం డడం వల్లే ఈ సంఘాన్ని విశ్వసి స్తున్నారని తెలంగాణ రాష్ట్ర వర్కిం గ్ జర్నలిస్టుల సంఘం (టీయూడ బ్ల్యూజే ఐజేయు) రాష్ట్ర అధ్యక్షు లు కె.విరాహత్ అలీ స్పష్టం చేశారు. శని వారం నాడు మల్కాజ్ గిరి లోని పద్మావతి ఫంక్షన్ హాలులో టీయూ డబ్ల్యూజే-ఐజేయు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గడ్డ మీది బాల్ రాజ్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జర్నలిస్టుల స మావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు పొం దుతున్న సౌకర్యాలన్నీ ఉమ్మ డి రా ష్ట్రంలో తమ సంఘం సాధిం చిన వేనని, గత పదేళ్ల కాలంలో జ ర్నలిస్టులకు ఆశించిన ప్రయోజ నా లేమి లేవని విరాహత్ విచారం వ్య క్తం చేశారు. ఓ వైపు మీడియా సం స్థలకు బాసటగా నిలిచి, మీడియా స్వేచ్ఛను పరిరక్షిస్తూనే, మరోవైపు జర్నలిస్టుల గొంతుకగా నిలబడి, వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాటాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
నాటి నుండి నేటి వరకు తమ సం ఘం ఏ రాజకీయ పార్టీకి అనుబం ధంగా పనిచేయలేదని, ఏ ప్రభు త్వానికి వత్తాసు పలకలేదని, జర్న లిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాడు తుందన్నారు. నేడు ప్రజల్లో మీడి యా పట్ల విశ్వాసం సన్నగిల్లిపోవ డానికి కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపై తమ సంఘం ప్రత్యేక దృష్టి సారిం చినట్లు విరాహత్ స్పష్టం చేశారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిని అవి త్రం చేసే శక్తులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించా రు.
యూనియన్ రాష్ట్ర కోశాధికారి మో తె వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విలు వలతో కూడిన జర్నలిజాన్ని తమ సంఘం ప్రోత్సహిస్తుందని చెప్పా రు. తమ సంఘానికి ఉన్న సుదీర్ఘ పోరాటాల చరిత్ర, హక్కుల సాధన తోనే రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని, అదరాభిమానాల్ని చూరగొంటున్నట్లు ఆయన తెలి పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో యూ నియన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జి ల్లా కార్యదర్శి దొంతుల వెంకట్రాం రెడ్డి, కోశాధికారి కోశాధికారి బి. భిక్షపతి, సహాయ కార్యదర్శి వెం కటేష్, మల్కాజ్ గిరి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షుడు బాల్ రాజ్, నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు బాలాజీ తదిత రులు పాల్గొన్నారు.
పలువురు టీయూడబ్ల్యూజేలో చేరిక ….
టీయూడబ్ల్యూజే-ఐజేయు సంఘం కార్యకలాపాలకు ఆ కర్షితులైన మల్కాజ్ గిరికి చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు శనివారం నాడు 143 సంఘానికి రాజీనామా చేసి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ సమక్షంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూలో చేరారు. 143 సంఘం జిల్లా నాయకులు సునీల్ రెడ్డి, మండే సురేష్, విశాల్ యాదవ్, రెహ్మాన్, లవ కుమార్, సంగమేశ్వర్, శ్రీకాంత్ లతో పాటు పలువురు జర్నలిస్టులు ఆ సంఘానికి రాజీనామా చేసి టీయూడబ్ల్యూజే-ఐజేయు సభ్యత్వం తీసుకున్నారు