–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ :రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా రైస్ మిల్లర్లు మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా అన్లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. శనివారం ఆమె హాలియా లోని బాలాజీ రైస్ ఇండస్ట్రీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన దాన్యాన్ని ఎప్పటికప్పుడు వెంటనే దించుకోవాలని, జాప్యం చేయవద్దని చెప్పారు.
జాప్యం చేయడం వల్ల రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అన్ని రకాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. తాలు, తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు కల్పించవద్దని ఆమె ఆదేశించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇన్చార్జి రెవిన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, బాలాజీ రైస్ ఇండస్ట్రీ యజమాని యాదగిరి, తదితరులు ఉన్నారు.