Big Breaking :ప్రజా దీవెన, భద్రాచలం: భద్రాచ లం ఐటిసి కంపెనీ పార్కింగ్ యార్డ్ లో లారీ నుంచి 30 కిలోల గంజా యిని హైదరాబాద్ కు చెందిన ఎస్ టిఎఫ్ బి టీం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నా రు.
ఐటిసి పేపర్ మిల్లు కోసం అవసర మైన ముడి సరుకు కర్రను తీసు కు ని వస్తున్న లారీ డ్రైవర్ శివ ఒరి స్సా నుంచి గంజాయిని తీసుకొస్తు న్న అర్జున్ ను ఎక్కించుకొని భద్రా చలం తీసుకువచ్చాడు. ఈ సమా చారం అందుకున్న హైదరాబాద్ ఎస్ టిఎఫ్ బి- టీం ఎస్ఐ బాలరా జు మిగతా సభ్యులు కలిసి ఐటిసి పార్కింగ్ యార్డ్ లో నిలిచి ఉన్న లారీని తనిఖీలు చేయగా డ్రైవర్ సీట్ కింద ప్రత్యేక అరలో 30 కేజీల గంజాయి పట్టుబడింది.
డ్రైవర్ శివతో పాటు ఒరిస్సా కు చెందిన అర్జున్ గంజాయి వ్యాపా రిని కలిసి పలుమార్లు ఒరిస్సా నుం చి గంజాయిని తీసుకువచ్చి భద్రా చలంలో అమ్మకాలు చేపట్టినట్లు విచారణలో నిందితులు వెల్లడిం చారు. ఎప్పటి లాగానే ఈసారి కూ డా తీసుకువచ్చిన గంజాయిని ఎస్ టిఎఫ్ పోలీసులు పట్టుకోవడంతో గంజాయి అక్రమ రవాణా దారుల గుట్టురట్టు అయింది. పట్టుకున్న గంజాయి విలువ రూ. 15 లక్షలు, సీజ్ చేసిన లారీ విలువ రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేశా రు. డ్రైవర్ శివ గంజాయిని తీసు కొచ్చిన అర్జున్ మరో వ్యక్తి ప్రహ్లాదు ను గంజాయిని, లారీని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు.
గంజాయి పట్టుకున్న ఎస్ టిఎఫ్ బి -టీం ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.వి కమలహాసన్ రెడ్డి, బీటీం ఇంచార్జ్ ప్రదీప్ రావులు అభినం దించారు.