Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, తమ ఒత్తిడికి త‌లొగ్గిన ప్ర‌ధాని మోదీ

CM Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: తమ అధినేత రాహుల్ గాంధీ సూచ‌న‌ల‌ తోనే కులగ‌ణ‌న చేప‌ట్టామని, కుల గణనలో దేశానికి తెలంగాణ ఒక‌ రోల్ మోడల్ గా యావత్ దేశానికే తెలంగాణ ఆద‌ర్శంగా నిలిచిoదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నేత‌ల్లో అసూయ‌, అసం తృ ప్తి క‌నిపిస్తోంది గురువారం మీడి యాతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భార‌త్ జోడో యాత్రలో కాం గ్రెస్ అగ్ర‌నేత‌ రాహు ల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పు డు విన్నార‌ని, కులగణన చేస్తామ ని హామీ ఇచ్చార‌ని, ఆయ‌న సూ చ‌న మేర‌కు తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌ న చేప‌ట్టామ‌ని ముఖ్య‌మంత్రి రేవం త్ రెడ్డి గుర్తు చేశారు.

కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఈ సంద ర్భంగా రాహుల్ గాంధీకి అభినంద నలు తెలియజేస్తున్నామ‌న్నారు. అలాగే అసెంబ్లీలో రెండు తీర్మాన నాలు చేసి కేంద్రానికి కూడా పంపిం చిన‌ట్లు చెప్పారు. జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వే ష న్లలో 50 శాతం పరిమితిని తొల గించాలని తీర్మానం పంపామ‌న్నా రు.

జంతర్ మంతర్ ధర్నాకు జడి సిన ప్రధాని…. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘా లతో కలిసి ధర్నా చేపట్టామ‌ని, త‌మ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కూడా కులగణనపై నిర్ణయం తీసుకున్నారని సీఎం రే వంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని చె ప్పారు. జనగణనతో కులగణన ఎ ప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాల ని కోరారు. కులగణనకు అనుసరిం చే విధానాలపై అన్ని రాజకీయ పా ర్టీలతో చర్చించాల‌న్నారు. ఇందుకు కేంద్ర మంత్రులతో కూడిన కమిటీ తో పాటు, అధికారులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయాల‌ని సూచించారు. తాము కులగణన చే పట్టే క్రమంలో విధి విధానాలు రూ పొందించి ప్రజల ముందు పెట్టామ‌ న్నారు. తెలంగాణలో మేం 57 ప్రశ్న లతో 8 పేజీలతో కూడిన సమాచా రాన్ని సేకరించామ‌ని చెప్పారు. కు లగణనలో అన్ని రాజకీయ పార్టీల ను భాగస్వాములను చేశామ‌ని, ఎ క్కడా మా పార్టీ కార్యక్రమంలా చే యలేదని, అందరినీ భాగస్వామ్యం చేసి కులగణన పూర్తి చేశామ‌ని చెప్పారు.

అందుకే కులగణనలో దేశంలోనే తె లంగాణ ముందు వరుసలో నిలి చిందని చెప్పారు. కులగణనలో దేశానికి తెలంగాణ ఒక‌ మోడల్ గా నిలిచింద‌న్నారు.కులగణనపై కేం ద్రంతో త‌మ అనుభవాన్ని పంచు కోవడానికి త‌మ‌కు ఎలాంటి భేషజా లు లేవ‌ని, బలహీన వర్గాలకు మే లు జరగాలనేదే త‌మ‌ సంకల్పమ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహు ల్ గాంధీ ఆలోచనలను అమలు చే సేందుకు ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చె ప్పారు. దేశంలోనే ఎక్కడా లేని వి ధంగా త‌మ‌ ప్రభుత్వం కులగణన చేసించూపించింద‌న్నారు.

రాజకీయ లబ్ది కోసమే త‌మ‌పై విమర్శలు… త‌మ‌ను విమర్శించే రాష్ట్ర‌ బీజేపీ నేతలను ఒకటే అడు గుతున్నానని పదేళ్లుగా అధికారం లో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదని ముఖ్యమంత్రి ప్ర‌శ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోస మే త‌మ‌పై విమర్శలు చేస్తున్నార‌ న్నార‌ని, స్థానిక‌ బీజేపీ నాయకుల లో అసూయ, అసంతృప్తి కనిపి స్తోంద‌న్నారు. రేవంత్ రెడ్డి విధానా లను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో కనిపిస్తోంద‌ని, తెలం గాణ మోడల్ దేశానికి రోల్ మోడ ల్ అన్నారు. మొన్నటి వరకు బీజే పీ కులగణనకు వ్యతిరేకంగా మా ట్లాడిందని, త‌మ‌ ఒత్తిడితోనే కేం ద్రం కులగణనకు ముందుకు వ చ్చింద‌ని, బీజేపీ తమ సంకీర్ణ ప్ర భుత్వాన్ని కాపాడుకోవాలంటే కు లగణన చేసి తీరాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని అన్నారు. మ‌హాత్మా గాంధీ శాంతియుత ప‌ద్ధ‌తుల్లో విజ‌యాన్ని సాధించారని, గాంధీ విగ్ర‌హాన్ని హిరోషిమాలో పెట్టుకొని జ‌పానీయులు పూజిస్తున్నార‌ని గు ర్తు చేశారు. అదే విధంగా మ‌హా త్ముడు అనుకున్న‌ది సాధించే వ‌ ర‌కు వ‌దిలిపెట్ట‌లేదో రాహుల్ గాంధీ కూడా అలానే వ‌దిలిపెట్ట‌ర‌ని, ఏదో ఒకరోజు వారు అనుకున్న‌ది అంద‌ రూ పాటించాల్సిందేన‌ని సీఎం రే వంత్ స్పష్టం చేశారు.