–ఇందిరమ్మ ఇండ్లు 600 చదరపు అడుగులు అధిగమించొద్దు
–ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు
–ఈనెల 5 నుంచి 20 వతేదీ వరకు 28 మండలాల్లో భూభారతి
–వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Indiramma Houses construction :ప్రజా దీవెన, హైదరా బాద్: ఇందిర మ్మ ఇండ్ల పధకంలో భాగంగా ని యోజకవర్గానికి కేటా యించిన 3,5 00 ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక ప్ర క్రియను మరింత వేగవంతం చేయా లని రాష్ట్ర రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లబ్ది దారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంత వరకు ఏరోజుకారోజు ఇన్ఛార్జి మంత్రుల నుంచి లబ్ది దారుల జాబి తాకు ఆమోదం తీసుకోవాలని అలాగే ప్రతి నియోజకవ ర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్దిదా రుల ను ఎంపిక చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావుతో కలిసి భూ భా రతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి లతో మంత్రిగారు వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ఇంటిని ర్మాణం 400 చదరపు అ డుగులకు తగ్గకుండా 600 చద రపు అడుగు లకు మించకుండా నిర్మాణం జరి గేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. అ నర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మ ధ్యలో ఉన్నా కూడా రద్దు చేస్తామ న్నారు. లిస్ట్-1, లి స్ట్-2 లిస్ట్ -3 లతో సంబంధం లే కుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు.
5 నుంచి 20వ తేదీవరకు.. గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీవరకు జి ల్లాకొక మండలం చొప్పున 28 జి ల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31వ తేదీవరకు పరిష్కరించాలని , పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియ జేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు.
605 మండలాలకు గాను ఇప్పటి వరకు 590 మండలాల్లో అవగా హనా సదస్సులను నిర్వహించడం జరిగిందని ఇందులో 85,527 మం ది పౌరులు, 1,62, 577 మంది రైతులు పాల్గొన్నారని తెలిపా రు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో న మోదు చేయాలని, అసైన్డ్ ల్యాం డ్లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టాఉండి పొజిషన్ మీద లేనివారి వివరా ల ను సేకరించాలని సూచించారు.
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు… విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా ఈనెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు ఏ ర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రం నుండి 72,572 మంది విద్యార్దులు నీట్ పరీక్షకు హాజరవుతున్నా రని ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయ డం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రా ల్లో త్రాగునీరుతోపాటు ఓ ఆర్ ఎస్ ప్యాకట్లు, మెడికల్ కిట్ లను అం దుబాటులో ఉంచుకోవాలన్నారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్దులకు అవసరమైన సూచనలను ముం దుగానే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడి యా ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశం లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, సి.సి. ఎల్. ఎ డైరెక్టర్ మకరంద్, హౌసింగ్ కార్పొ రేషన్ ఎం.డి, వి. పి. గౌతమ్ , లా & ఆర్డర్ డిఐజి మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొం డ జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్ పి శరత్ చంద్ర పవార్ ,ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్,స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్,అదనపు ఎస్పీ రమేష్, నల్గొండ ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి,నీట్ నోడల్ అధికారి శ్రీనివాసు లు,తదితరులు హాజరయ్యారు.