Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

E-City in Future City : మంత్రి కీలక వ్యాఖ్య, ఫ్యూచర్ సిటీలో ఈ – సిటీ

–వేయి ఎకరాల్లో ప్రత్యేకంగా అభి వృద్ధి
–రాష్ట్రంలో సిరా నెట్ వర్క్స్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ రూ.300 కోట్ల పెట్టుబడి
— రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

E-City in Future City :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తు న్న “ఫ్యూచర్ సిటీ”లో వేయి ఎకరా ల్లో ప్రత్యేకంగా “ఎలెక్ట్రానిక్ సిటీ (ఈ సిటీ)ని అభివృద్ధి చేయనున్న ట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపా రు.రాష్ట్రంలో సయుక్తంగా రూ.3 00 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన టెలికాం ఉత్పత్తు ల సంస్థలు సిరా నెట్ వర్క్స్ (తై వాన్), ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూ ప్(తెలంగాణ) ప్రతినిధులతో ఆ యన శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు.

ఎలెక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరిం చారు. ఈ తరహ పరిశ్రమలు ఏ ర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఇ బ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. టైర్ -2, టైర్ -3 నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామన్నారు.
ఆయా ప్రాంతాల్లో వారి అవసరాల కు అనుగుణంగా అవసరమైన మౌ లిక సదుపాయాలను కల్పిస్తామ న్నారు.

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వా మ్యయ్యేందుకు ముందుకొచ్చిన సిరా నెట్ వర్క్స్, ఎల్ సీజీసీ రె జల్యూట్ గ్రూప్ ప్రతినిధులకు కృత జ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తర ఫున అన్ని రకాలుగా అండగా ఉం టామని హామీ ఇచ్చారు. సుమారు 10 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పరిశ్రమ ద్వారా 2500 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయ న్నారు. ఇక్కడ 5జీ నెట్ వర్క్స్ , మల్టీ లేయర్ నెట్వర్కింగ్ సొ ల్యూషన్స్, సర్వర్స్ తదితర టెలి కాం ఉత్పత్తులను తయారు చేస్తా రన్నారు. ఈ పెట్టుబడితో ఇండో తైవాన్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో టీజీఐసీసీ సీఈవో మధుసూదన్, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, సిరా నెట్వర్క్స్ ప్రతినిధులు చుయాన్, జాయ్ భట్టాచార్య, డౌగియాస్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ నుంచి రణ్విందర్ సింగ్, గీతాంజలి సభర్వాల్ తదిత రులు పాల్గొన్నారు.