Soldiers Accident :ప్రజా దీవెన, శ్రీనగర్: ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకె ళ్లడంతో ఘోర ప్రమాదం చోటు చే సుకుంది. 700 అడుగుల మేర ఎ త్తు నుంచి కిందపడడoతో ఆర్మీ వా హనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించగా పలువురు గాయ పడ్డారు.
జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం జమ్ము నుంచి శ్రీనగర్కు ఆర్మీ కాన్వాయ్ వెళ్తున్నది. ఉద యం 11.30 గంటల సమయంలో జాతీయ రహదారి 44లోని బ్యా టరీ చష్మా ప్రాంతం సమీపంలో ఒక ఆర్మీ వాహనం అదుపుతప్పింది. 7 00 అడుగుల లోతైన లోయలోకి అది దూసుకెళ్లింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు సైని కులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆర్మీకి చెందిన పలు కాగితాలు, వస్తువులు ప్రమాద స్థ లం వద్ద చెల్లాచెదురుగా పడి ఉ న్నాయి. కాగా ఈ ప్రమాదం గు రిం చి తెలిసిన వెంటనే ఆర్మీ, జ మ్ముక శ్మీర్ పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్ర తిస్పందన దళ సభ్యులు అ క్క డకు చేరుకున్నారు. సహాయక చ ర్యలు చేపట్టారు. మరణించిన సై నికులు, గాయపడిన వారిని పైకి చేర్చారు.
మరణించిన జవాన్లను అమిత్ కు మార్, సుజీత్ కుమార్, మాన్ బ హదూర్గా గుర్తించారు. గాయ ప డిన సైనికులను హాస్పిటల్కు తర లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపు తున్న ట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.