Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chess Competitions : చెస్ పోటీలు విద్యార్థులలో మేధాశక్తిని పెంచుతాయి

జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి క్ర్రపాకర్

Chess Competitions :  ప్రజాదీవెన, నల్గొండ జిల్లా :చెస్ పోటీలు విద్యార్థులలో మేధాశక్తిని పెంచుతాయని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి క్ర్రపాకర్ అన్నారు. ఆదివారం స్ధానిక టిటిడి కళ్యాణ మండపం లో ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్ 15,9 విద్యార్దులకు నిర్వహించిన చెస్ పోటీలను జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి క్ర్రపాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా స్ధాయి పోటీలలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్ధాయి పోటీలకు పంపిస్తామని అన్నారు. విద్యార్థులు నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపెందించుకోవాలని, ఎఐ టెక్నాలజీ నేర్చుకోవాలని అన్నారు. త్వరలోనే విద్యానగర్ లో ఉచితంగా చెస్ నేర్పించడానికి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామని అన్నారు.అండర్ 15 బాలుర విభాగంలో ప్రధమ బహుమతి లోకమాన్య చారి, ద్వితీయ బహుమతి అఖిలేష్, తృతీయ బహుమతి గౌతమ్, అండర్ 15 బాలికలు
ప్రధమ బహుమతి రమ్య, ద్వితీయ బహుమతి ఇందిర, తృతీయ బహుమతి సాయి సాత్విక గెలుపొందారు. అండర్ 9 బాలుర విభాగంలో ప్రధమ బహుమతి ఆర్యన్ వర్మ, ద్వితీయ బహుమతి పవన్ ప్రసాద్, తృతీయ బహుమతి జతిన్ రెడ్డి గెలుపొందారు. అండర్ 9 బాలికల విభాగంలో పున్న కోమల గెలుపొందారు. ‌
గెలుపొందిన విజేతలకు షీల్డ్, మెమొంటో లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ కుమార్, కోశాధికారి మురళి,
గండూరి శ్రీధర్, దేవరశెట్టి శ్రీకాంత్, వెంకటమురళి, నర్సింగరావు, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.