RoadAccident: ప్రజా దీవెన, కీసర: మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా కీసర పరిధిలోని ఓఆర్ ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న కం టై నర్ను వెనక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా రు.కారు వెనక సీట్లో కూర్చున్న మ రో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బీదర్ నుంచి హైదరాబాద్కు వ స్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరి గింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వా హనంలో స్థానిక ఆస్పత్రికి తరలిం చారు. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తర లించారు. క్షతగాత్రుల్లో ఒకరి తల కు బలమైన గాయం కావడంతో ప రిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు స్తోంది. మృతులు నగరంలోని మే డిపల్లి, బోడుప్ప ల్కు చెందిన యశ్వంత్(25), చార్లెస్(25)గా పోలీసులు గుర్తించా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.