Nationwide Caste Census 2025 :ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీల పోరాట ఫలితంగా తెలంగాణ రా ష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉ ద్యోగ మరియు స్థానిక సంస్థల ఎ న్నికలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవే శపెట్టిన బీసీ బిల్లును రాష్ట్ర గవర్న ర్ జిష్ణు దేవ్ వర్మ ఎలాంటి సవరణ లు లేకుండా యధావిధిగా ఆమో దించి రాష్ట్రపతికి పంపించిన సంద ర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ సంఘాల ప్రతినిధుల బృందం సోమవారం హైదరాబాదులోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని కలిసి అభినందించారు.ఈ సంద ర్భంగా గవర్నర్ గారిని బీసీ సంఘా ల నేతలు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కుల గనణ, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పై ఏకగ్రీవంగా చేసిన బీసీ బిల్లు, అ లాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూ డా దేశవ్యాప్తంగా జనాభా లెక్కల లో సమగ్ర కులగణను చేపట్టాలని నిర్ణయించడం తదితర అంశాలపై గవర్నర్ తో జరిగిన భేటీలో ప్రధా నంగా చర్చకు వచ్చినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వెల్ల డించారు.
ఇదే సమయంలో జాతీయ స్థా యిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాడాన్ని అభి నందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి మరియు కేంద్ర క్యాబినెట్ కూడా గ వర్నర్ ద్వారా బీసీ ప్రతినిధుల బృం దం ధన్యవాదాలు తెలిపినట్లు తెలి పారు.
ఏప్రిల్ 2వ తేదీన బీసీ సంక్షేమ సం ఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జన మహా ధర్నాలో 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజకీయ పార్టీలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొనడంతో దేశస్థాయిలో కులగ నన అంశం తీవ్రంగా చర్చకు రావ డం, దేశంలో తెలంగాణ మరియు బీహార్ లో జరిగిన కులగణనతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింద ని, కులగనణ చేయమని సుప్రీంకో ర్టుకు రాతపూర్వకంగా అపిడవిట్టు సమర్పించిన కేంద్ర ప్రభుత్వం ఈరో జు కులగణన చేస్తామని వెల్లడించ డం ఇది బీసీల పోరాట విజయం గా భావిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణలో ఇప్పటికే కులగణన పూర్తి చేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు చేసినందున కేంద్ర ప్రభుత్వం కులగణన పట్ల సానుకూ ల వైఖరి ఉందని తాము అనుకుం టున్నామని ఒకవేళ కులగణణ పై సానుకూల వైఖరి ఉంటే తెలంగాణ ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ బిల్లును తక్షణమే ఆమోదించి త మిళనాడు తరహాలో 9వ షెడ్యూ ల్లో చేర్చి చట్ట రూపంలోకి తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశా రు.
ఇటీవల తమిళనాడు కేసు సంద ర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీ బిల్లు కూడా మూడు నెలల్లోనే తేల్చాల్సిన బాధ్యత రా ష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఎలాంటి జాప్యం లేకుండా కేంద్ర ప్ర భుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చన సరే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని లేకుంటే మరొకసారి ఉ ద్యమం పెద్ద ఎత్తున నిర్వహించక తప్పదని ఆయన హెచ్చరించారు
తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్య మం రోజురోజుకు బలపడుతున్న క్ర మంలో కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్ తమ విశిష్ట అధికారాలను ఉప యోగించి 42 బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా,అలాగే దేశంలో ని సామాజిక రిజర్వేషన్లపై విధించి న 50% పరిమితిని ఎత్తివేసేలా, కేం ద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రి త్వ శాఖ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కి విజ్ఞప్తి చేసినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు
గవర్నర్ ని కలిసిన బీసీ ప్రతినిది బృందంలో బీసీ కుల సంఘాల జే ఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రా ష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటి కొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కన కాల శ్యాం కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మ ని మంజరి సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి చంద్ర శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నా రు.