Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AntiWorkerPoliciesIndia : మోదీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

–దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు కర్షకులు సిద్ధం కావాలి

–కార్మిక రైతు సంఘాల నేతల పిలుపు

AntiWorkerPoliciesIndia :ప్రజాదీవెన నల్గొండ :బిజెపి నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వి. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సంయుక్త సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూ డోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ హక్కులు కాలరా స్తుందని, వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ఉపా ధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టలు కొడుతుందని వారు విమర్శించారు.

ధరలు నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మోడీ ప్రభు త్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. దేశంలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో పెరిగి పెద్దవైన ప్రభుత్వ రంగ సంస్థలని, గనులు భూములు ఓడరేవులు సహజ వనరులన్నిటిని స్వదేశీ విదేశీ బడా పెట్టుబడుదారులకు కారు చౌకగా అమ్ముతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మతం పేరుతో ప్రజల మధ్య విద్వేష రాజకీయాలు చేస్తూ సమస్య లను పక్కదోవ పట్టిస్తూ కాలం గడుపుతుందని ఎద్దేవ చేశారు. ఈ విధానాలను ప్రతిఘటించడం కోసమే కార్మిక వర్గం రైతాంగం 145 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో రై తాంగం కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నా య కులు బండ శ్రీశైలం, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీ నారా యణ పాల్గొన్నారు.