District Topper Rekha Sri : ప్రజా దీవెన, కోదాడ: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో పట్టణంలోని స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలకు చెందిన తాళ్లూరి శ్రీలేఖ 571 మార్కులు సాధించి జిల్లాలోని టాపర్ గా నిలిచింది ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని స్థానిక మండల సహకార కళాశాల ఆవరణలో_నిర్వహిస్తున్న పాలిటెక్నికల్ టిఎస్ ఆర్ జె సి ఎంట్రెన్స్ శిక్షణ కేంద్రంలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం ( AASK), కోదాడ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య అధ్యక్షతన సన్మానకార్యక్రమాన్నినిర్వహించారు కార్యక్రమనికి ముఖ్య అతిథిగా
ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ MS కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ,
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల కలిగి ఉండి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ముందు ముందు పై తరగతులలో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు అలాగే కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని ఈ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలనన తెలిపారు, అనంతరం రేఖశ్రీ ని అభినందించారుఈ కార్యక్రమంలో AASK ప్రధాన కార్యదర్శిమాతంగి ప్రభాకర్ రావుMS కళాశాల CEO:షేకు. శ్రీనివాస రావు ఆడెపు.వెంకటేశ్వర్లు (JL, గురుకుల)కోర్స్ డైరెక్టర్: యలమర్తి శౌరి ,కోర్స్ కో- ఆర్డినేటర్: గంధం. బుచ్చరావు నందిపాటి. సైదులు ,
చెరుకుపల్లి కిరణ్ ,జానకి రాములు ,మీసాల రవి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.