బి.శ్రీనివాస్ ,మున్సిపల్ కమీషనర్
Suryapet Municipality LRS Collections : ప్రదీవెన, సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లే -అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ ఆర్ ఎస్ )లో 25% రాహితి ఫీజు వసూలులో జిల్లాలో సూర్యాపేట మున్సిపాల్టీ ముందంజలో వున్నదని మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ తెలిపారు.. సూర్యాపేట మున్సిపాల్టీలో 35633 మంది ఎల్ ఆర్ ఎస్ కు దరకాస్తు చేయగా 31940 మందికి ఫీజ్ ఇంటిమేషన్ ఇవ్వగా 6585 మంది ఫీజు చెల్లించుట జరిగింది అని దానిలో భాగంగా ఫీజు 20 కోట్ల 75 లక్షలు వసూలు చేయుట జరిగి జిల్లాలో మొదటి స్థానంలో వున్నదని తెలిపారు..
ఇప్పటి వరకు ఎల్ ఆర్ ఎస్ నిబంధనల మేరకు 2472 మందికి ప్రొసిడింగ్ లు జారీ చేయుట జరిగింది అన్నారు. ఎల్ ఆర్ ఎస్ నిబంధనలు అనుసరించి అర్హత వున్న వారికీ కూడా దశల వారీగా ప్రొసిడింగులు జారీ చేయుట జరుగునన్నారు.లబ్ది దారులు తమ ఫైల్ ప్రాసెస్ కొరకు lrs సిటిజన్ లాగిన్ లో చూసుకొని ప్రొసిడింగ్ నేరుగా పొందువొచ్చన్నారు..