Kalyana Lakshmi and Shaadi Mubarak Cheques : 306 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…..
–నాలుగు మండలాలకు 3.06 కోట్లు చెక్కుల పంపిణీ…..
–జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవర్…
–ప్రభుత్వ పథకాలు అర్హులందరూ వినియోగించుకోవాలి….
–తెలంగాణ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి….
–ప్రపంచంలో ఎక్కడ లేని పథకం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం…..
–సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి…..
Kalyana Lakshmi and Shaadi Mubarak Cheques : ప్రజాదీవెన, సూర్యాపేట : సూర్యాపేట డివిజన్ లోని నాలుగు మండలాలలోని 306 మంది లబ్ధిదారులకు 3,06 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సూర్యాపేట రెవెన్యూ డివిజన్లోని సూర్యాపేట 143 మందికి ,పెన్పహాడ్ 55, చివ్వెంల 66 ,ఆత్మకూర్ (ఎస్) 42, ఒక్కొక్కరికి1,00,116 రూ॥ నిరుపేద యువతుల వివాహం కోసం అందజేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులు వచ్చిన ఆడపడుచులందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లలు న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, జీవనంలో ఆహారం భాగం కావాలని, ఆహారంలో అన్ని పోషకాలు లేకపోవడం వల్ల వివిధ వ్యాధులు దానిలో ముఖ్యంగా ఎనీమియా సమస్య వస్తుందని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటే భావితరాలు కూడా ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు.
గర్భిణీలు ఏఎంసి రిజిస్ట్రేషన్ చేయాలని, వారికి అంగన్వాడీల ద్వారా పోషక ఆహారాలు అందాలని, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పిల్లలకు టీకాలు టైం ప్రకారం వెఘంచాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే డెలివరీలు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం తెలంగాణ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలలో వివాహాలు చేయుటకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని ప్రభుత్వం1,00, 116 రూపాయలు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద అందజేస్తుందని ఈరోజు సూర్యాపేట డివిజన్లో 306 మందికి చెక్కులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయనున్నట్లు టూరిజం చైర్మన్ పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 3500 మందికి ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం సూర్యాపేట శాసనసభ్యులు గుంటకడ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ పేద ఆడపిల్ల పెళ్లికి ఒక లక్ష 116 రూపాయలు అందించడం ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో లేదని ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం అందిస్తున్నారని తెలిపారు .గతంలో ఈ పథకం ద్వారా 50 వేల రూపాయలు అందించే వారిని ఆలోచించి దీనిని 1,00, 116 రూపాయలుగా పెంచి ఇవ్వడం జరుగుతుందని, ఈ పథకం అన్ని వర్గాల పేద ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి విషయంలో ఆలోచించి పేద ప్రజలకు పలు పథకాలు ప్రవేశపెట్టి తమ వంతు సహాయం అందిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ ,సూర్యాపేట తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, పెన్పాడు తహసిల్దార్ లాలు, ఆత్మకూరు తాసిల్దార్ హరి కిషోర్ శర్మ, చివ్వంల తాసిల్దార్ కృష్ణయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.