Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy :సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, భారత సాయుధ దళాల శౌర్యo గర్వకార ణం

CM Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: ఆపరే షన్ సిందూర్‌లో భారత సాయుధ దళాల శౌర్యాన్ని తెలంగాణ ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొని యాడారు. పాకిస్తాన్ మరియు పా క్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్ర వాద కేంద్రాలపై భారత సైన్యం ని ర్వహించిన నిర్దేశిత దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయ ని పేర్కొన్నారు. ఈ విజయాన్ని జా తీయ సంఘీభావం మరియు ఐక్య తకు ప్రతీకగా భావిస్తున్నట్లు తెలి పారు.

ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాల కు బలంగా అండగా నిలుస్తున్నా ను. ఉగ్రవాద నిర్మూలన కోసం భా రత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంత మైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామ ర్థ్యాన్ని, సాహసాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరం వినిపిద్దాం -జై హింద్ అని ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌ మెంట్ మరియు ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో అ త్యవసర సమీక్ష సమావేశం నిర్వ హించనున్నారు. దేశ రక్షణలో హై దరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా ఉండటంతో, తాజా పరిస్థితులపై, తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలపై ఆయా విభాగాలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

పరిణామాల నేపథ్యంలో ప్రజ లెవ రూ భయభ్రాంతులకు గురికాకుం డా, ఎల్లవేళలా అప్రమత్తంగా ఉం డాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశా రు. ఏవైనా అనుమానాస్పద విష యాలు కనిపిస్తే వెంటనే పోలీసు విభాగానికి సమాచారం అందిం చాలని సూచించారు.