Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Government Schools : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులు

–ఏడాదిలో 57వేల ప్రభుత్వోద్యోగా లిచ్చాం
–హామీలను నెరవేర్చేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తుంటే మాపై విమ ర్శలా
–దశల వారీగా అర్హులందరికీ ఇం దిరమ్మ ఇళ్లు
— రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Telangana Government Schools :ప్రజా దీవెన, షాద్ నగర్: దేశంలో ఏడాది వ్యవధిలోనే 57వేల ప్రభు త్వ ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగి స్తామన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియో జకవర్గం కొత్తూర్ లో “నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల” నూతన భవనా న్ని ప్రారంభించి మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో డిజిటల్ తరగతి గదులను ఏ ర్పాటు చేసేందుకు చర్యలు తీసు కుంటున్నామన్నారు. రాష్ట్రంలో వి ద్యా వ్యవస్థ ప్రమాణాలను పెంచేం దుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తుందన్నారు. ఈ ప్రక్రియలో నిపుణులను భాగస్వామ్యం చేస్తు న్నామన్నారు. ప్రైవేట్ పాఠశాల ల కు ధీటుగా సర్కారు బడుల్లో చది వే విద్యార్థులను తీర్చిదిద్దుతామ న్నారు. ఏఐ లాంటి ఎమర్జింగ్ టె క్నాలజీస్ ను కరిక్యులంలో భాగం చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రు ల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పదోన్న తులను కల్పించామన్నారు. పాఠ శాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అమ్మ కమిటీలు ఏర్పాటు చేశామ న్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు కావాలనే పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.
పదేళ్లుగా పేదలకు ఇళ్లు ఇవ్వకుం డా బీఆర్ఎస్ కాలం వెళ్లదీసి ఇప్పు డు మాపై విమర్శలు చేయడం ఎం త వరకు సమంజసమని ప్రశ్నించా రు.

ఇది ప్రజల కోసం పని చేసే ప్రభు త్వమని, దశల వారీగా అర్హులం దరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తా మని స్పష్టం చేశారు. కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య, నాట్కో సంస్థ ప్రతినిధులు లక్ష్మి నా రాయణ, పీఎస్ఆర్ కే ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.