–పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఈఓ
Textbook Distribution :ప్రజాదీవెన నల్గొండ :విద్యా సంవత్సరం 2025-26 కు సంబంధించి విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల సరఫరా ప్రారంభమైంది. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు మొత్తం 569970 పాఠ్యపుస్త కాలు అవసరం కాగా నేటి వరకు జిల్లాకు 367940 పుస్తకాలు మాత్రమే జిల్లా కు చేరుకున్నాయి.
జిల్లాకు చేరుకున్న పుస్తకాలను మండలాలకు పంపిణీ చేసే కార్యక్రమని డిఇఓ బిక్షపతి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల డిపో మేనేజర్ వెంకటాచారి, పర్యవేక్షకులు ముచ్చర్ల శీనయ్య తదితరులు పాల్గొన్నారు.