Uttarakhand Helicopter Crash :ప్రజా దీవెన, ఉత్తరాఖండ్: ఆహ్లా దంగా గడుపుతున్న వారి జీవితా ల్లో విషాదఛాయలు అలుముకు న్నాయి. ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలి కాప్టర్ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలవ్వగా మరో ఇద్దరి కి గాయాలయ్యాయి. ఆకస్మాత్తుగా జరిగిన ఈఘటన ఉత్తరకాశీ జిల్లా లో గురువారం ఉదయం సమయం లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే కొందరు పర్యాటకు లతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్ భగీరథి నది సమీపంకు చేరుకోగా నే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మ రో ఇద్దరు గాయాలతో బయట పడ్డారు.
వెనువెంటనే సమాచారం అందుకు న్న స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలి యరాలేదు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధి కారులు వెల్లడించారు.