Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Resolve Land Disputes:భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Resolve Land Disputes : ప్రజా దీవెన, సూర్యాపేట :భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం వెలిదండ గ్రామాం zphs లో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్ తదితర వాటిని సందర్శించి, రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. సదస్సులతో భేటీ అయ్యి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా భూభారతి విధివిధానాల గురించి, చట్టంలో పొందుపర్చిన అంశాలపై అవగాహన కల్పించారు.

రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన మీదట నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం పైలెట్ ప్రాతిపదికన గరిడేపల్లి మండలంలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు ముగిశాక, జిల్లాలోని మిగితా మండలాల్లో గల అన్ని రెంవెన్యూ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు జరిగిన గానుగ బండ రెవెన్యూ సదస్సులో 69 దరఖాస్తులు వెలిదండలో జరిగిన రెవెన్యూ సదస్సులో 269 దరఖాస్తులు రైతుల నుండి స్వీకరించటం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సదస్సులలో హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు తాసిల్దార్ డీఎవో రాజేందర్ రెడ్డి,కవిత, ఏఆర్ఐ రాంబాబు ఎమ్మారై ప్రవీణ్ ఇతర అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.