RTC Bus Utilization : శాలిగౌరారం మే 8: నకిరేకల్ నుంచి శాలిగౌరారం మీదుగా మనిమద్దె గ్రామం వరకు రెండు ట్రిప్పులు,ఉప్పల్ ఎక్స్ రోడ్డు వరకు వేసిన ఒక ట్రిప్పు బస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ ఆర్ టి సీ డిపో మేనేజర్ శ్రీనాథ్ అన్నారు. గురువారం అయన శాలిగౌరారం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ నల్లగొండ డిపో కు చెందిన బస్సు
ప్రతీ రోజు నకిరేకల్ నుంచి శాలిగౌరారం మీదుగా ఉదయం 7 గంటలు, సాయంత్రం 5 గంటలకు మనిమద్దె వరకు నడుపుతున్నట్లు తెలిపారు. నకిరేకల్ నుంచి శాలిగౌరారం, గురజాల, అమ్మనబోల్, మోత్కూర్, భువనగిరి మీదుగా ఉప్పల్ ఎక్స్ రోడ్డు వరకు ఉదయం 9-30, తిరిగి ఉప్పల్ ఎక్స్ రోడ్డు నుంచి మధ్యాహ్నం 1-15 గంటలకు బయలుదేరి ఇదే రూట్ లో నకిరేకల్ కు చేరుకుంటుదని, ఈ బస్సు సౌకర్యం ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డి ఎం శ్రీనాథ్ తెలిపారు.