Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sakshi Media : సాక్షి పై ఏపీ ప్రభుత్వ దౌర్జన్యం గర్హనీయం

--టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్

 

Sakshi Media : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సాక్షి దినపత్రిక జర్నలిస్టులు, ఆ పత్రిక సంపాదకులు ధనుంజయ రెడ్డి పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు పూనుకోవడం సభ్య సమాజం గర్హిం చే విషయమని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఏపీ ప్రభు త్వం కక్ష పూరితంగా వ్యవహ రించి సాక్షి ఎడిటర్‌ ఇంటిపై దాడి చేయిం చడం దుర్మా ర్గమైన చర్య అని అ భివర్ణించారు. సాక్షి దినపత్రిక ఎడి టర్‌ ధనుంజయ్‌రెడ్డి ఇం టిపై అకారణంగా ఏపీ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయిం చ డాన్ని ఖండి స్తూ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘా ల ఆధ్వర్యంలో నల్ల గొండ జిల్లా కేం ద్రం పెద్ద గడియారం సెంటర్‌లో గురువారం సాయం త్రం నిరసన ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవాలను వెలికి తీస్తే ప్రభు త్వం బెదిరించే విధంగా దాడులు, అక్రమ కేసులు బనా యించడం సమంజసం కాదని ఖం డించారు.అక్రమ కేసులు, దాడులు చేస్తే జర్నలిస్టు సంఘాలు ఉపేక్షిం చవని వ్యాఖ్యానించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం విధానాలు ఇక నైనా మార్చుకోకపోతే భవిష్యత్తు లో ఐక్య ఉద్యమాలకు పూనుకుం టామని హెచ్చరించా రు.

ఈ సందర్భంగా సాక్షి బ్యూరో ఇన్‌చార్జి చిం తకింది గణేష్, ఎడి షన్‌ ఇన్‌చార్జి బొడ్డు జనార్థన్‌రెడ్డి లు మాట్లాడుతూ తప్పులను ఎత్తి చూ పితే ఏపీ ప్ర భుత్వం పోలీసులతో సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇం టిపై దాడులు చేయించడం సమంజసంకాదన్నారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను జాగృ తo చేసిపెద్ద ఎత్తున ఆందోళోన చేస్తామని హెచ్చరించారు. వాస్తవా లను వెలికి తిసి పత్రికల్లో రాస్తే ఏపీ ప్రభుత్వం కక్షకట్టి అక్రమ కేసులు పెట్టి వేధిం చడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. సాక్షి టీవీ ప్రతి నిధి పాశం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెలికి తీ స్తున్న సాక్షి మీడియాపై, సాక్షి ఎడిటర్, జర్న లిస్టులపై దాడులు చే యించ డం దారుణమైన విషయమన్నారు. ప్ర భుత్వం తనతీరు మార్చుకు ని బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జర్నలిస్టు సంఘాల బాద్యులు ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు లు ఫహీమోద్దీన్, రాతికింది అంజయ్య, మాదురి యాదయ్య, గాదె రమేష్, చంద్రశే ఖర్‌ రెడ్డి, వివిధ దినపత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు కట్టాసుధాకర్, జిల్లా యాదయ్య, వంగాల శ్రీనివాసరెడ్డి, మీసాల శ్రీని వాస్, ఆవుల లక్ష్మయ్య, బత్తుల శ్రీనివాస్‌గౌడ్‌, తుమ్మన గోటి వెం కట్, దశరథ, రాంప్రసాద్, శేఖర్, మధు,రవి, వేణు, శివశం కర్, నవీన్‌ రెడ్డి, రషీద్, ఫొటో జర్నలిస్టులు కంది భజరంగ్‌ ప్రసాద్, కంది శ్రీని వాస్, భవాని ప్రసాద్ పాల్గొన్నారు.