Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Agriculture : ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నల్గొండ

–నేటి కి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

–కొనుగోలు కేంద్రాలకు 1.25 కోట్ల గోనె సంచులను

–304 సాధారణ, 6 ఆటోమేటిక్ ప్యాడ్ క్లీనర్ల పంపిణీ

–రైతులకు 636.70 కోట్ల చెల్లింపు

— మిల్లుల్లకు 200 శాతం సామర్ధ్యం వరకు దించుకోవడానికి అనుమతి

–కొనుగోలు ఆలస్య నివారణకు చర్యలు

–అదనపు కలెక్టర్ నారాయణ అమిత్

Telangana Agriculture :ప్రజాదీవెన నల్గొండ బ్యూరో :నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నేటి వరకు 375 కొనుగోలు సెంటర్ల ద్వారా 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 4.18 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం, 0.12 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యము కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలులో నల్గొండ జిల్లా రెండవ స్థానంలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు 1,25,84,000 గోనె సంచులను కొనుగోలు కేంద్రాలకు ఇచ్చామని,
ఇందులో 62,84,000 కొత్త గోనె సంచులు, 63,00,000 పాత గోనె సంచులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ 1,07,50,000 గోనె సంచులను ధాన్యం కొనుగోలు కు వాడటం జరిగిందని, మిగిలినవి కొనుగోలు కేంద్రములలో ఉన్నట్లు తెలిపారు. కొన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అధికంగా వస్తుందని, తేమ శాతం కూడా 17 శాతం వుండటం తో వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున గోనె సంచులు అధికముగా అవసరం అవుతున్నాయి. ఒకవేల కొనుగోలు కేంద్రములలో గోనె సంచులు అయిపోయినట్లయితే సెంటర్ ఇన్చార్జిలను అడిగిన మరుసటి రోజే బస్తాలు సర్దుబాటు చేస్తామని తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు 304 ప్యాడి క్లీనర్లు, 6 ఆటోమేటిక్ ప్యాడ్ క్లీనర్లు, పంపిణీ చేశామని, కొరుగోళ్ల కేంద్ర నిర్వాహకులు తాలు తీసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు క్యాండీ క్లీనర్లు ఉపయోగించి ధాన్యంలోని తాలును తొలగించి ఎఫ్ ఏ క్యూ నిబంధనల ప్రకారం వుండే విధంగా చూసుకోవాలని దీని ద్వారా కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని తెలిపారు.

 

4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యని 58,833 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందని, కొనుగోలు చేసిన ధాన్యము విలువ 998.68 కోట్ల రూపాయలు కాగా 36 220 మంది రైతులకు 636.70 కోట్ల రూపాయలు చెల్లించేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి రోజు జిల్లాలో సుమారుగా 15 నుంచి 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రవాణా కాంట్రాక్టర్లు సమకూర్చిన లారీల ద్వారా కొనుగోలు కేంద్రముల నుండి రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, రోజు సుమారుగా 500 లారీలు ధాన్యం రవాణా చేస్తున్నాయని, జిల్లా ఎస్పీ, ఆర్టీవో అధికారుల సహకారంతో అదనపు లారీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్నీ మిల్లులకు కూడా 200 శాతం సామర్ధ్యం వరకు ధాన్యాన్ని దించుకోవడానికి అనుమతి ఉందని, జిల్లాలోని చాలా మిల్లులు 130 నుండి 150 శాతం వరకు ధాన్యాన్ని దించుకున్నారని, రైస్ మిల్లులలో స్థలాభావం వలన బస్తాల 30 నుండి 35 మీటర్ల ఎత్తులో వేయడం వలన మిల్లులలో దిగుమతులు ఆలస్యం జరుగుతుందని, దీనిని అదిగమించడానికి మిర్యాలగూడ లో వున్న అన్నీ రైస్ మిల్లులకి కేటాయింపులు చేసి ధాన్యం కొనుగోలు ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.