General Strike India : శాలిగౌరారం మే 9 :దేశంలో కార్మికులు, రైతు కూలీలు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు,అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కై మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) రైతు-కూలీ సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి లు పిలుపునిచ్చారు.శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల్లో భాగంగా ఎర్రజెండా ఎగురవేసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ దేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన పన్నుల భారాన్ని మోపుతూ లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ సంస్థలకు రాయితీలుస్తుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను శ్రామికుల శ్రమదోపిడిని దోచి పెట్టేందుకు 29 లేబర్ చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి కార్మిక వర్గాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తుందని పేర్కొన్నారు. 50 కోట్లకు పైగా ఉన్న శ్రామిక వర్గం శ్రమ దోపిడిని పెట్టుబడిదారి వర్గాలకు కట్టబెడుతుందని దుయ్యబట్టారు.
అందులో భాగంగానే ఈనెల 20న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు కూలీ సంఘాలు స్వచ్ఛంద పౌర ప్రజాస్వామిక సంఘాలు సార్వత్రిక సమ్మె మరియు గ్రామీణ బందుకు పిలుపునిచ్చాయని ఈ బందులో అన్ని వర్గాల ప్రజలు రోజువారి పనులను బందు చేసి పాల్గొనాలని దేశవ్యాప్తంగా స్తంభింపజేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు అంబటి వెంకటేశం, అంబటి నరసయ్య, ప్రభాకర్, అంబటి వెంకన్న,బండారి మురళీ,తాటిపాముల,వెంకటయ్య, పూలమ్మ,సావిత్రమ్మ,కొలుకొండ,దనమ్మ వెంకన్న, రాములు , ప్రమీల తదితరులు పాల్గొన్నారు