Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hyderabad Accident: ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. కారు మంటల్లో చిక్కి ముగ్గురి దుర్మరణం.!

Hyderabad Accidentప్రజా దీవెన, పెద్ద అంబర్ పేట: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద అంబర్‌పేట సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. శనివారం తెల్ల వారుజామున దాదాపు మూడు గంటల సమయంలో ఈ ఘటన జ రిగిందని, ఆగి ఉన్న బొలెరో వాహ నాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దానితో రెండు వాహనాలు కాలిపోయాయి.

ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇం దులో ఇద్దరు సజీవదహనం కాగా మరొకరిని మంటల నుంచి కాపాడి ఆసుపత్రికి తరలిస్తున్న సమయం లో ప్రాణాలు కోల్పోయారు. అబ్దు ల్లాపూర్‌ మెట్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

 

మృతులను హైదరాబా ద్‌లోని బహదూర్‌పుర హెచ్‌బీ కా లనీకి చెందిన దీపేశ్‌ అగర్వాల్‌ (2 3) విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన సంచయ్‌ మల్పాని (22), మూసాపే టకు చెందిన ప్రియాన్షు మిట్టల్‌ (23)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.