Air Strikes: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ తన దుందుడుకు చర్యలను కొన సాగిస్తూ భారత సరిహద్దుల్లో రెచ్చ గొట్టే దాడులకు తెగబడుతోన్న వి షయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్ జెట్ల తో దాడులకు ప్రయత్నించింది దా యాది పాకిస్థాన్. ప్రధానంగా శ్రీనగ ర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వైమా నిక స్థావరాలను లక్ష్యంగా చేసుకు ని పాకిస్తాన్ విమానాలు చొచ్చుకు రావడానికి ప్రయత్నించాయని భా రత సైన్యం అధికారికoగా మీడి యాకు వెల్లడించింది.
ఈ మేరకు కల్నల్ సోఫియా ఖురేషి శనివారం వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో దాడులు చేస్తోందని ఆ మె తెలిపారు. అయితే భారత సై న్యం వారి చర్యలను అంతే సమర్థ వంతంగా తిప్పికొడుతోందని తెలిపారు. పాకిస్తాన్ నిరంతరం రెచ్చగొట్టే చ ర్యలకు పాల్పడుతోందరి ఆమె వె ల్లడించారు. శుక్రవారం రాత్రి వారు ఏకంగా 24 చోట్ల మన వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నిం చారని, శ్రీనగర్, అవంతీపురా, ఉ ద్ధంపూర్ వంటి కీలకమైన స్థావరా లను లక్ష్యంగా చేసుకున్నారని ఆ మె తెలిపారు. కానీ భారత సైన్యం వారికి గట్టి జవాబు ఇస్తోందని కల్న ల్ సోఫియా ఖురేషి స్పష్టం చేశారు.
అంతేకాకుండా పాకిస్తాన్లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరా లపై భారత్ రాత్రిపూట విజయవం తంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని తెలిపారు. రావల్పిండిలోని నూ ర్ ఖాన్, చక్వాల్లోని మురిద్, షో ర్కోట్లోని రఫికి వైమానిక స్థావ రాలను లక్ష్యంగా చేసుకుని మిస్సై ల్ దాడి చేశామని, అవి పూర్తిగా ధ్వంసమయ్యాని తెలిపారు. భారత్ పూర్తి సంయమనంతో వ్యవహరి స్తోందన్నారు. ప్రతిదాడుల్లో భాగం గా బాలిస్టిక్ క్షిపణులను వాడుతు న్నామని తెలిపారు. కాగా S-400 ను ధ్వంసం చేశామంటూ పాక్ త ప్పుడు ప్రచారం చేసిందని సోఫి యా ఖురేషి పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఈ వరుస దాడులు ప్రాం తీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయన్నారు. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉం టూ శత్రువుల ప్రతి ప్రయత్నాన్ని వి ఫలం చేస్తోందని చెప్పారు. పాకిస్తా న్ ఈ దుస్సాహసాలకు తగిన మూ ల్యం చెల్లించక తప్పదని ఆమె హె చ్చరించారు.