Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Surveyor Training: ఉపాధి సదవకాశం, సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Surveyor Training: ప్రజా దీవెన, నల్లగొండ: భూ భారతి చట్టం- 2025 అమలులో భాగం గా అర్హులైన సర్వేయర్లకు శిక్షణ ఇ చ్చేందుకుగాను దరఖాస్తులను ఆ హ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విడుదల చేసిన ఒక ప్రకట నలో తెలిపారు. అర్హులైన అభ్యర్థు లు సర్వేయర్ల శిక్షణ కోసం ఈ నెల 17 లోగా సమీపంలోని మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాల ని ఒక ప్రకటనలో కోరారు.

ఎంపికైన సర్వేయర్లకు ఈనెల 26 నుండి జూలై 26 వరకు (50 పని దినాలు) శిక్షణ ఇవ్వనున్నట్లు కలె క్టర్ వెల్లడించారు.రెవెన్యూ పరిపా లన కు తోడుగా, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 మంది సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చి సర్వే యర్లను నియమించనున్నట్లు వెల్ల డించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి (భూమి హక్కుల రికార్డు చట్టం- 2025) ద్వారా భూమి సంబంధిత సేవలను ప్రజలకు కల్పించి వారి భూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో లైసెన్సుడ్ సర్వేయర్లను ని యమించనున్నట్లు కలెక్టర్ వెల్ల డిం చారు.అందువల్ల జిల్లాలోని సర్వే యర్లు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ,ఈనెల 17 లో గా దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.