Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kiran Kumar Reddy Donation : నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ఒక నెల జీతం విరాళం ప్రకటించిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy Donation :  ప్రజా దీవెన, శాలిగౌరారం మే 10:భారత ప్రజల రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడుతూ దాయాది దేశం పాకిస్థాన్ చేస్తున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉగ్ర స్థావరాలపై విరుచుక పడుతున్న భారత త్రివిధ దళాలకు మద్దతు తెలుపుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఒక నెల వేతనం ను నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

 

నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ఒక నెల వేతనాన్ని విరాళంగా కాంగ్రెస్ నాయకులు ఇవ్వాలని సూచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించి తన విరాళాన్ని ప్రకటించి తోటి లోక్ సభ, రాజ్యసభ ఎంపీ లు కూడా తమ విరాళాలను అందించాలని అభ్యర్థించారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు మనమంతా కలిసి ముందుకు సాగాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.