Subrahmanya Swamy Kalyanam : ప్రజా దీవెన,కోదాడ: మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో/ఏంచేసియున్న శ్రీ దూళ్ళగుట్ట బాల ఉగ్ర లక్ష్మినారాసింహా స్వామి దేవాలయ ఆవరణలో శనివారం సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ వేడుకలను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ నలజాల జగన్నాథం మాట్లాడుతూ స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆదివారం జరిగే బాల ఉగ్ర నరసింహ స్వామి కళ్యాణానికి కోదాడ ప్రాంతం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పార్థులు కావాలని తెలిపారు అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు