Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Puchalapalli Sundarayya: పీడత ప్రజల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య

ప్రజాదీవెన, నల్గొండ:

Puchalapalli Sundarayya: దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అలుపెరగని యోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యండి. సలీమ్, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. సోమవారం రాత్రి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాలనీలో సిపిఎం సీనియర్ నాయకులు బాణాల పరిపూర్ణాచారి ఎర్రజెండాను ఆవిష్కరించారు.

అనంతరం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా వారి ఫోటోకు పూలమాలవేసి జోహార్లు అర్పించారు. అనంతరం సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో 1913 మే ఒకటి న ఒక ధనిక కుటుంబంలో పుట్టాడు. 13వ ఏట నుండి తన గ్రామంలో వెట్టి చాకిరి అంటరానితనం అసమానతులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.

10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిపెట్టి వేలాది గ్రామాలలో గ్రామ సభలు పెట్టి దున్నే వాడుకే భూమి కావాలని, వేట్టి చాకిరి నశించాలని, భూస్వామ్య విధానం పోవాలని పేద ప్రజలను చైతన్యం చేస్తూ అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర సుందరయ్యకు ఉందని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు తన సైకిల్ పై వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపైన గలమెత్తి గర్జించి మాట్లాడేవారని పేర్కొన్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం వంటి అనేక పుస్తకాలు రాచించి మహారాష్ట్రకు చెందిన లీలను నిరాడంబరంగా వివాహమాడి వ్యక్తిగత జీవితంలోను ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు.

తన చిన్న వయసు నుండి చనిపోయేంతవరకు అనునిత్యం సిపిఎం పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు ఎర్రజెండా పేదలకు అండ అంటూ 40 సంవత్సరాల క్రితం తుది శ్వాస విడిచిన వారి ఆశయాన్ని మరువబోమని, వారి ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ముందుకు వెళుతుందని ఆ దిశలో ప్రజలు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, అనంతుల శంకరయ్య, సిపిఎం పార్టీ ఆర్టిసి కాలనీ శాఖ కార్యదర్శి కారంపూడి రాము, సహాయ కార్యదర్శి మాటూరి సునీత, కుంభం కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు, గుండాల నరేష్, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, అద్దంకి నరసింహ, గంజి నాగరాజు, బొల్లు రవీంద్ర కుమార్ శాఖ సభ్యులు జయశ్రీ, జి. పద్మ, అంతమ్మ, సంతోష, విజయలక్ష్మి, రవికుమార్, సల్లోజు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.