Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TJF Silver Jubilee: జలవిహార్ జర్నలిస్టుల జాతరకు తండోపతండాలుగా తరలివెళ్దాo

–టీయూడబ్ల్యూజె నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్

TJF Silver Jubilee: ప్రజా దీవెన, నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగ రంలోని జలవిహార్ లో ఈనెల 31 వ తేదీన తెలంగాణ జర్నలిస్టు ఫో రం రజతోత్సవ జర్నలిస్టుల జాతర సభకు జర్నలిస్టులు తండోపతం డాలుగా తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజె నల్ల గొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ కోరారు. టీజెఎఫ్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈనెల 31 వ తేదీన 25 సంవత్సరాల సం దర్బంగా హైదరాబాద్ లో నిర్వ హించే రజతోత్సవ సభకు జిల్లా నుండి జర్నలిస్ట్ సోదరులు పెద్ద ఎత్తున కదలిరావాలని పిలుపుని చ్చారు. సోమవారం నల్లగొండ జి ల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం లో టీజేఎఫ్ రజతోత్సవాల సం బంధిత వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు.

2001 మే నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఊపిరి గా టీజెఎఫ్ విర్భవించి0దన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఉ ద్యమం లో ముందు వరుసలో నిలబడి రా ష్ట్ర సాధించడంలో కీలక భూమిక పోషించిందని గుర్తు చేశారు. టీజె ఎఫ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూ ర్తి అవుతున్న సందర్బంగా హైదరా బాద్ లోని జలవిహార్ లో ‘జర్నలిస్ట్ ల జాతర ‘ను నిర్వహిస్తున్నారని, ఈ జాతరకు అన్నీ రాజకీయ పార్టీ ల ముఖ్యలు హాజరవుతారన్నారు. హైదరాబాదులోని జలవిహార్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రవి తోత్సవ సభను విజయవంతం చే యాలన్నారు. ఈ జాతరకు జిల్లా లోని అన్ని మండలాల నుంచి జర్న లిస్టు సోదరులు కావాలని అన్నా రు. తెలంగాణ ఉద్యమంలో టీజే ఎఫ్ పాత్ర అన్ని అనిర్వచనీయమ ని పేర్కొన్నారు. ఈ సందర్భంలో టీజేఎఫ్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 వ సంవత్సరంలోకి అడుగుతున్న శుభ సందర్భంలో వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నా రాయణ సార్ అధ్యక్షతన రజ తో త్సవ సభను నిర్వహిస్తున్నట్లు తెలి పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జర్నలిస్టు జాతరకు నకిరేకల్ నియోజకవర్గంలో నుంచి భారీ సంఖ్యలో హాజరై విజయవం తం చేయాలని కోరారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అన్నబోయిన మ ట్టయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెoక గురుపాదంలు టీజేఎఫ్ ప్ర స్థానాన్ని కూలంకషంగా వివరించా రు. ఈసమావేశంలో యూనియన్ జి ల్లా ప్రధాన కార్యదర్శి శేష రాజు ప ల్లి వీరస్వామి, చిన్న పత్రికల ప్ర తినిధి కమిటీ ఉపాధ్యక్షులు వేణు, రామసాయిలు, సతీష్, శంకర్ , జి ట్టా నరేష్ ,పొడిచేటి ప్రభాకర్, గం ధమల్ల యల్లయ్య వడ్లకొండ రామ సాయిలు ని యోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శు లు కొమ్ము యాదగిరి, శిరస్సు రమేష్ , ఉపాధ్యక్షులు, డేగటి శ్రీను, సోమ వెంకటరెడ్డి, ఒంటెపాక అం బేద్కర్, కార్యద ర్శులు బొడిగ వి జయ్,గుండ్లపల్లి వెంకన్న, మునిగ లింగమలు,కదిర వీరేందర్ సంయుక్త కార్యదర్శి రే పాల రంగనాథ్, కా ర్యవర్గ స భ్యు లుగా సింగం వెంకన్న, వంశీ, దేశ పోయిన సాయికుమార్, రామగిరి వెంకటేష్, కొల్లు నరేష్, కోల్లోజు శ్రీ కాంత్, చిట్యాల మండలం అధ్య క్షుడు కారంపూడి మధుప్రధాన కార్యదర్శి వాస రామ్మోహన్, రంగ నాదు, సంతోష్ శ్రావణ్, విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.