Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IASilatripathi : భవిత కేంద్ర నిర్మాణo త్వరితగతిన పూర్తిచేయాలి

 

IASilatripathi:   ప్రజా దీవెన, నాంపల్లి: భవిత కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి అధి కారులను ఆదేశించారు.గురువారం ఆమె నాంపల్లి మండల కేంద్రం లోని ప్రాథమిక పాఠశాలలో ఉన్న భవిత కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భవిత కేంద్రాలలో కల్పించాల్సిన మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.

ముఖ్యంగా ర్యాంపు, టాయిలెట్స్, ఆక్టివి టీ రూము, ఇతర అన్ని సౌకర్యాలు భవిత కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎం ఈఓ తో పాటు, ఇంజనీరింగ్ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృ ష్టి వహించి పూర్తిచేయాలని అన్నారు.గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ ,ఇన్చార్జ్ ఆర్డిఓ రమణారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ వెంకన్న, ఆర్ఐ విజయ, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.