–శిక్షణ తరగతులలో జూలకంటి రంగారెడ్డి
public movements : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ప్రజా సమస్యలు గాలికి వదిలేసి రాజకీ య ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు పాకులా డుతున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా ఆధ్వ ర్యంలో ప్రజా ఉద్యమాలు చేయాల ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ స భ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధ వారం హైదరాబాదులోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో నల్గొండ జి ల్లా రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను సృష్టిస్తుందని ఆరోపిం చారు. కాశ్మీర్లో పర్యటకులపై దాడి చేసి 27 మంది పర్యాటకులను చం పిన 4 గురు ఉగ్రవాదులను ఇంతవ రకు పట్టుకోలేదని విమర్శించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఏదో సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమ ర్శించారు. దేశ ప్రజలందరూ యు ద్ధం చేయాలని కోరుకుంటుంటే ట్రం పు చెప్పాడని యుద్ధాన్ని ఆపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిం చారు. దీనికోసం యుద్ధం ఎందుకు ఆపారో ప్రజలకు వివరించాలని డి మాండ్ చేశారు.
యుద్ధంలో జరిగిన సంఘటనపై దేశ ప్రజలకు వివరించాల్సిన అవ సరం ప్రధాని మోడీపై ఉందని చె ప్పారు. ఆ విషయాన్ని పార్లమెంటు సమావేశ నిర్వహించి పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు వివరించాల ని కోరారు. యుద్ధంపై అఖిలపక్షం సమావేశం నిర్వహించాలన్నారు. బీహార్ లో బిజెపి కూటమి గెలిపిం చుకునేందుకు మోడీ విశ్వ ప్రయ త్నాలు చేస్తున్నాడని దానికోసం యుద్ధాన్ని వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆరు పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల ను అమలు చేయడంలో విఫలమైం దని విమర్శించారు. 6 గ్యారంటీల లో రైతుబంధు, రైతు భరోసా, మ హాలక్ష్మి, నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ పెంపు వంటి హామీలు అమ లు కావటం లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మంత్రివర్గ కూర్పును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోయారని విమర్శించా రు.
కాంగ్రెస్ లోనే కుమ్ములాటలు సాగు తున్నాయని, అదే కుమ్ములాటలు ప్రతిపక్ష పార్టీలో కూడా కొనసాగు తుందని చెప్పారు. అదేవిధంగా బి జెపి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవ రికి వారే వ్యవహరిస్తున్నారని తెలి పారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలకు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదని విమ ర్శించారు. ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ఎర్రజెండా ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ శక్తి ఎర్రజెండాకు మాత్రమే ఉందని తెలిపారు.గ్రామస్థాయిలో ఉద్యమాలు జరిపి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.
అనంతరం మొదటి క్లాసు గా శాస్త్రీ య దృక్పథం అనే అంశంపై తాటా రమేష్ బోధించారు. జిల్లా కార్యద ర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగా ర్జున ప్రిన్సిపాల్ గా ఉన్న ఈ కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికార్ మల్లేష్, నారి ఐలయ్య, జిల్లా కా ర్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, లక్ష్మీ నారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.