Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IPL stampede tragedy : తీవ్ర విషాదం, ఐపీఎల్ విజయోత్స వంలో తొక్కిసలాట 8మంది మృతి

IPL stampede tragedy : ప్రజా దీవెన, బెంగుళూరు: ఐపీఎల్ -18 కప్ గెలిచిన బెంగళూరు రాయ ల్ చాలెంజర్స్ విజయోత్సవ సంబు రాల్లో చోటు చేసుకున్న అపశృతి కా రణంగా తీవ్ర విషాదం నెలకొంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడి యంలో నిర్వహిస్తున్న గ్రాండ్ సెల బ్రేషన్స్లోలో తీవ్ర విషాదం చోటుచే సుకుంది. తొక్కిస లాటలో ఎనిమి ది మంది అభిమానులు మృతి చెం దగా పలువురికి తీవ్ర గాయాల పా లైనట్లు సమాచారం.

ఐపీఎల్ టైటిల్ నెగ్గిన నేపథ్యంలో ఈ విజయాన్ని ఫ్యాన్స్తో కలిసి సె లబ్రేట్ చేసుకోవాలని ఆర్సీబీ యా జమాన్యం నిర్ణయించింది. వేడుక లను వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 8 మంది అభిమానులు మృత్యువాత పడగా పలువు రి పరిస్థితి విషమం గా ఉందని అధికారిక వర్గాలు వెల్ల డిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రమాద సమయం లో ఉన్న కర్ణాటక గవర్నర్‌, సీఎం, మంత్రులు స్టేడియంలోనే ఉండడo గమనార్హం. కాగా స్టేడియంలోపలికి అభిమానులు ఒక్క సారిగా తోసుకె ళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా కొచ్చారు.

బారికేడ్లు దూకివెళ్లిన క్రి కెట్‌ అభి మానులను పోలీసులు అదుపు చేయలేకపోవడంతో చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట సంభవిం చింది.

విషాద ఛాయలు… ప్రమాదం తర్వాత క్రీడాలోకంతో పాటు సర్వ త్రా విషాదఛాయలు ఆలుముకు న్నాయి. ఇందుకేనా మీరు కప్ గెలి చింది, ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న ఆర్సీబీ అంటూ సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలు చుకున్న ఆనందం ఆ మరుక్షణమే విషాదంగా మారింది. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన భారీ తొక్కిస లాటలో ఎనిమిది మంది అభి మా నులు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు.మరణించిన వారిలో ఒక బాలుడు కూడా ఉన్న ట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్టేడి యం వద్ద విషాదఛాయలు అలు ముకున్నాయి.

ఐపీఎల్ కప్ గెలిచిన తరుణంలో అభిమానుల సంబరాల కోసం చి న్నస్వామి స్టేడియంలో ప్రత్యేక సెల బ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే అభిమానులు ఊహించిన దాని కంటే భారీ సంఖ్యలో స్టేడియం వద్ద కు చేరుకోవడంతో తొక్కిసలాట చో టుచేసుకుంది. అభిమానులు ఒ క్క సారిగా లోపలికి దూసుకురావ డం తో పోలీసులు సైతం పరిస్థితిని అ దుపు చేయలేకపోయారని అధికా రులు తెలిపారు.

తక్కువ సమయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావడం, సరైన ఏర్పాట్లు చేయలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తు న్నారు.ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “జనాల్ని చం పేందుకే కప్ సాధించారా అంటూ ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థా యిలో విరుచుకుపడుతున్నారు.
గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా సెలబ్రే షన్స్ చేయలేదని, వారి అతి కార ణంగానే అభిమానులు మరణించా రని నెటిజన్లు మండిపడుతున్నా రు.