Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Employee Issues : ఉద్యోగులకు తీపికబురు,సమస్య ల పరిష్కారంకు ప్రభుత్వం ఒకే

Employee Issues : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉద్యో గుల సమస్యల పరిష్కారం మా ప్ర భుత్వం బాధ్యత, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించా లని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల స బ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహా దారు కేశవరావు తదితరులతో కలి సి సమావేశంలో పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలపై మీ అందరి తో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి సానుకూ లంగా నిర్ణయం తీసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీ కి సూచించారని డిప్యూటీ సీఎం తె లిపారు. ఉద్యోగుల సమస్యలపై ని యమించిన త్రీమెన్ కమిటీ ఉద్యో గ సంఘాలతో పలుమార్లు సమావే శమై విజ్ఞప్తులను స్వీకరించారు. మీ వద్ద స్వీకరించిన సమాచారాన్ని క మిటీకి పలు దఫాలుగా వివరించా రు. గత కొన్ని సంవత్సరాలుగా బ కాయిలు పేరుకుపోవడంతో అన్ని ఒకేసారి చేయలేకపోయాం, ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనదే ప్రభుత్వ ఆలోచన అ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు వివరించారు.

గురువారం క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలి పారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భా గస్వాములు గా ప్రజా ప్రభుత్వం భా విస్తుందని తెలిపారు. ప్రజలకు చే యాల్సిన పనులు, అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం వీటన్నిటితో పాటు ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సి నవి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందని డిప్యూటీ సీఎం వివ రించారు. ఒకవైపు ప్రజలకు మరో వైపు ఉద్యోగులకు ఇబ్బందులు కల గకుండా కలిసి కూర్చుని చర్చించు కుని ముందుకు పోవాలన్న ఆలోచ నతోనే క్యాబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమా వేశమైనట్టు డిప్యూటీ సీఎం తెలిపా రు.

గత పది సంవత్సరాల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి అ యినప్పటికీ ఉద్యోగులకు సాధ్య మైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనలో భాగంగానే మా ప్రభు త్వం రాగానే మొదటి తారీకు నే జీ తాలు చెల్లిస్తుందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొ నసాగిస్తూనే, కొత్త పథకాలు పెద్ద సంఖ్యలో తీసుకువచ్చాం, విజయ వంతంగా అమలు చేస్తున్నాం వీటికి తోడు ఉద్యోగుల డిమాండ్లను పరి ష్కరించాలన్న తపనలో ప్రజా ప్రభు త్వం ఉందని డిప్యూటీ సీఎం తెలి పారు.

వనరులు సమకూర్చుకొని ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం పడకుండా ముందుకు పోతున్నాం అదే నేపథ్యంలో ఉద్యోగుల సంక్షే మం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నాం ఈ కసరత్తు విజయవం తం కావాలని మనసున్న ప్రభుత్వం కోరుకుంటుందని వివరించారు. ఉ ద్యోగులకు మంచి చేయాలన్న ఆలో చనతోనే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని వివరించారు.
ప్రభుత్వ ఆదాయానికి మరియు ఖర్చుకు చేయాల్సిన పనులను బేరీ జు వేసుకొని ఆర్థిక భారం ఉన్నప్ప టికీ ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని సీఎం రేవంత్ రెడ్డి బలం గా ఉన్నారని డిప్యూటీ సీఎం ఉద్యో గ సంఘాలకు భరోసా ఇచ్చారు.

ఉ ద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆ సు పత్రుల ఖర్చులకు సంబం ధించి న సమస్యలపై క్యాబినెట్ సహచరు లం అంతర్గతంగా పలుమార్లు చ ర్చించుకున్నామని ఉద్యోగుల సమ స్యలు పరిష్కరించాలన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదని తెలి పారు. గురువారం క్యాబినెట్ స మావేశం నేపథ్యంలో ఉద్యోగ సం ఘాల సమస్యలపై ఏర్పాటు చేసిన అధికారుల త్రీ మెన్ కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి క్యాబినె ట్ కు నివేదిస్తాం, పరిష్కారం కను గొంటామని డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క మల్లు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. సమావేశం లో అధికారులు నవీన్ మిట్టల్, లో కేష్ కుమార్, కృష్ణభాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియా, మహేష్ దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు.