Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fund Mobilization : భట్టి విక్రమార్క అప్పీల్, నిధుల స మీకరణపై దృష్టిసారించాలి

Fund Mobilization : ప్రజా దీవెన, హైదరాబాద్: నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గు రువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రిసోర్స్ మొబలైజే షన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావే శం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సబ్ కమిటీ సభ్యుడు మంత్రి జూపల్లి కృష్ణారా వు, ఉన్నతాధికారులు పాల్గొన్నా రు.

రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రతివారం జరుగుతుందని, తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ను వేగంగా అమలు చేయాలని డి ప్యూటీ సీఎం అధికారులను ఆదేశిం చారు. తాజా సమావేశంలో తీసు కున్న నిర్ణయాలు, వాటి ప్రగతిని వ చ్చేవారం సమావేశంలో అంశాల వారీగా సమీక్షిస్తామని తెలిపారు. తాజా సమావేశంలో రెవెన్యూ రి సోర్స్ మొబిలైజేషన్ కు సంబంధిం చి వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నిర్మించా లని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో శాఖల వారీగా అం శాలను డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు.

సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాని యా, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రె టరీ వికాస్ రాజు, ఎక్సైజ్, కమర్షి యల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రి జ్వీ, సి సి ఎల్ ఏ సెక్రటరీ నవీన్ మి ట్టల్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీ శ్రీధర్, కమిషనర్లు హరిత, హరికి రణ్, విష్ణువర్ధన్, సురేంద్రమోహన్, బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇలంబర్తి , ఆర్ వి కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.