Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yashoda Hospital Treatment : యశోద ఆసుపత్రిలో అత్యాధునిక ప్రమాణాలతో చికిత్స

–సిసికెడి రోగికి ప్రాణదానం చేసిన డాక్టర్లు

Yashoda Hospital Treatment : ప్రజాదీవెన నల్గొండ : దీర్ఘకాలికమైన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చావు దగ్గరికి వెళ్లిన రోగిని యశోద ఆసుపత్రి డాక్టర్లు అత్యాధునిక ప్రమాణాలతో కూడిన చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. యశోద ఆసుపత్రి కి చెందిన డాక్టర్లు వీరమనేని చేతన్, డాక్టర్ బి. వెంకటరెడ్డి లు గురువారం మనోరమ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 56 సంవత్సరాల వయసున్న జనార్దన్ రెడ్డి అనే రోగి దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో మూత్రం రాక కడుపు ఉబి జ్వరం, శ్వాస సమస్యలు, కాళ్ల వాపుతో బాధపడుతూ నల్లగొండ లోకల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా రోగికి వ్యాధి నయం కాకకోవడంతో యశోద ఆసుపత్రిలో చేరినట్లు డాక్టర్లు తెలిపారు. వెంటనే తాము సకాలంలో రోగి స్థితిని గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకొని అరుదైన చికిత్స చేసి అతన్ని కాపాడినట్లు పేర్కొన్నారు. అతనికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కి కారణమైన గ్లో మేరీలో నెఫ్రాటిస్ వ్యాధి బయటపడిందని, వెంటనే తాము వ్యాధికి అనుగుణంగా చికిత్సను అందించడం వల్ల రోగి ప్రాణాలను కాపాడడం సాధ్యమైంది అన్నారు.

 

యశోద ఆసుపత్రి వైద్య నిపుణుల సమర్థవంతమైన చికిత్సకు స్పందించి రోగి మెల్లమెల్లగా కోల్పోవడం ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రోగి పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పొంది తన పని తాను చేసుకున్నట్లు వారు తెలిపారు. మలకపేట యశోద ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందిస్తూ ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడడం జరిగిందని, ఏదైనా తీవ్ర సమస్యలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరితే సకాలంలో వ్యాధులు గుర్తించి సరైన చికిత్స అందిస్తామని వారు తెలిపారు. మలకపేట యశోద ఆసుపత్రిలో నల్గొండ జిల్లాకు చెందిన వారే ఎక్కువ వస్తుంటారని నల్గొండ జిల్లా ప్రజలకు మలకపేట యశోద హాస్పిటల్ పూర్తిగా అందుబాటులో ఉందన్నారు. మలక్పేట యశోద ఆసుపత్రి తో పాటు అన్ని యశోద ఆసుపత్రులలో అత్యంత క్లిష్టమైన జబ్బులు వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి కోఆర్డినేటర్ ఏ. వాసు కిరణ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.