Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponguleti Srinivasa Reddy: ఇక ప‌ట్ట‌ణాల్లోనూ ఇందిర‌మ్మ ఇండ్లు

–పేద‌లు ఉన్న చోటే జి+3 ప‌ద్ద‌తిలో ఇండ్ల నిర్మాణం
–గిరిజ‌నుల‌కు ప్ర‌త్యేకంగా 22 వేల ఇండ్లు
–రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమా చార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Minister Ponguleti Srinivasa Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్: పేద‌వా డి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌ క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రే వం త్‌రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భు త్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇంది ర‌మ్మ ఇండ్ల నిర్మాణ ప్ర‌క్రియ‌ గ్రామీణ ప్రాంతాలలో ఒక కొలిక్కి తీసుకువ చ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల లో కూడా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మా ణంపై దృష్టి సారించామ‌ని రాష్ట్ర రె వెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌ సంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. శుక్ర‌వా రం ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై స‌ మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మం త్రి మాట్లాడారు.

ప‌ట్ట‌ణాల్లోని మురికి వాడ‌ల్లో జీవ‌ నం కొన‌సాగిస్తున్న పేద‌లు అక్క‌డే ఉండ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నార‌ని ముఖ్యంగా హైదరాబాద్ కు దూ రంగా ఇండ్లు నిర్మించి ఇస్తే త‌మ జీవ‌నోపాధికి ఇబ్బంది క‌లుగు తుం ద‌న్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవ‌ డానికి ఆస‌క్తి చూప‌డం లేద‌న్నారు. హైద‌రాబాద్ కు దూరంగా గ‌తం లో 42 వేల ఇండ్ల‌ను నిర్మించ‌గా సుమారు 19 వేల మంది మాత్ర‌మే అక్క‌డికి వెళ్లారు. ఇటీవ‌ల క్షేత్ర‌స్ధా యిలో మ‌రోసారి ప‌రిశీల‌న జ‌రుప‌ గా కేవ‌లం 13 వేల మంది మాత్ర‌ మే ఆ నివాసాల‌లో ఉంటున్న‌ట్లు తేలింద‌న్నారు. ఈ అంశాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో ప్ర‌ధానంగా హైద‌రా బాద్ న‌గ‌రంలోని మురికి వాడ‌ల్లో పేద‌లు ఉన్న‌చోటే జి+3 ప‌ద్ద‌తిలో ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మించాలని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇందులో భాగంగా తొలివిడ‌త‌లో హైద‌రాబాద్‌లో 16 మురికివా డ‌ల‌ ను గుర్తించామ‌ని. అలాగే వ‌రంగ‌ ల్‌, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌ గ‌ ర్‌, న‌ల్గొండ క‌రీంన‌గ‌ర్ త‌దిత‌ర ప‌ట్ట‌ ణాల‌లో కూడా ఇదే విధానాన్ని అ మ‌లు చేసేలా కార్యాచ‌ర‌ణ రూపొం దిస్తున్నామ‌ని తెలిపారు. ఏండ్ల త‌ర‌ బ‌డి నిలువ నీడలేక‌, త‌ల‌దాచుకో వ‌డానికి గూడు లేని చెంచుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సూచ‌న మేర‌కు భ‌ద్రాచ‌లం, ఉట్నూరు, ఏ టూరునాగారం, మున్న‌నూరు నా లుగు ఐటిడిఎ ప‌రిధిలోగ‌ల‌ చెం చు, కొలం, తోటి, కొండ‌రెడ్ల‌కు 13, 266 ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూ రు చేశామ‌ని అలాగే రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌ టికే 8,750 ఇండ్లు మంజూరు చేశా మ‌ని దీనితో క‌లిపి గిరిజ‌నుల‌కు ఇం త‌వ‌ర‌కు 22,016 ఇందిర‌మ్మ ఇం డ్లు మంజూరు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ఇండ్ల‌కు త‌క్ష‌ణ‌మే ల‌బ్దిదారుల‌ను గుర్తించి ఇండ్ల ని ర్మాణ ప్ర‌క్రియ‌ను ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ ను ఆదేశించారు.

ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు, నిర్మా ణంలో మ‌రింత క్రియాశీల‌కంగా వ్య‌ వ‌హ‌రించాల‌ని ప్ర‌భుత్వ‌ ల‌క్ష్యానికి అనుగుణంగా ఇండ్ల నిర్మాణం జ‌రి గేలా నిరంతరం ప‌ర్య‌వేక్షించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దేశం లో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా పేద‌ వాళ్ల ఇంటికోసం ఐదు ల‌క్ష‌ల రూపా యిలు ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, ఎ న్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రా ష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇం దిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌ని , దీనికి అను గుణంగా అధికార యంత్రాంగం ప‌ని చేయాల‌ని అన్నారు.